ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ ఇక లేరు. ముంబయిలోని సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విటర్ ద్వారా ప్రకటించారు. దాదాపు నెల రోజులుగా ముంబయిలోని సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యం మరింత క్షీణించి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమెకు 92 సంవత్సరాలు.


‘‘దేశం గర్వించదగ్గ, సంగీత ప్రపంచంలో స్వర కోకిల అయిన భారతరత్న లతా మంగేష్కర్ గారి మృతి చాలా బాధాకరం. ఆమె పవిత్ర ఆత్మకు నా హృదయపూర్వక నివాళులు. ఆమె మృతి దేశానికి తీరని లోటు. సంగీత ప్రియులందరికీ ఆమె ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆమె గొంతు 30 వేలకు పైగా పాటలు పాడింది. లతా దీదీ చాలా ప్రశాంత స్వభావం కలవారు.. ప్రతిభతో కూడిన సంపన్నురాలు. దేశవాసులందరిలాగే, లతా మంగేష్కర్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. నాకు సమయం దొరికినప్పుడల్లా, ఆమె పాడిన పాటలను తప్పకుండా వింటాను. భగవంతుడు లతా ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి’’ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వరుస ట్వీట్లు చేశారు.






దాదాపు నెల రోజులుగా ముంబైలోని సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించిందని కొద్ది రోజులుగా వైద్యులు చెబుతూ వస్తున్నారు. ఆమెను వెంటిలేటర్ సపోర్టుపైనే ఉంచి డాక్టర్లు చికిత్స అందించారు. కోవిడ్-19, న్యుమోనియాతో బాధపడుతున్న ఆమె జనవరి 8 ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. డాక్టర్ ప్రతీత్ సమ్దానీ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు వైద్యం చేసింది.