టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో పాటు వ్యాపారాలు కూడా చేస్తుంటుంది. సినిమాల ద్వారా సంపాదించే డబ్బుని రకరకాల బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ-కామర్స్ సైట్ లో వ్యాపార భాగస్వామిగా చేరింది సమంత. సస్టెయిన్ కార్ట్ అనే స్టార్టప్ కంపెనీలో సమంత పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీకి ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనుంది. గతేడాది జనవరిలో లాంచ్ చేసిన ఈ కంపెనీలో పర్యావరణసహిత వస్తువులను అమ్ముతారు. 


బట్టలు, డెకొరేషన్ ఐటెమ్స్, హెల్త్ ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ ఇలా రకరకాల వస్తువులు ఈ సైట్ లో దొరుకుతాయి. అన్నీ కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఉత్పత్తులే. పర్యావరణం, ప్రకృతిపై సమంతకి కాస్త శ్రద్ధ ఎక్కువే. ఆమె తినే ఆహారపదార్ధాలను కూడా సేంద్రీయ పద్దతిలో పండించుకుంటూ ఉంటుంది. అందుకే ఈ కంపెనీ ఐడియాకి సమంత కనెక్ట్ అయింది. పెట్టుబడులు కూడా పెట్టింది. 


సమంత ఇప్పటికే పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది. ఆమెకి సొంతంగా 'సాకి' అనే బట్టల బ్రాండ్ కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ స్టార్టప్ కంపెనీలో కూడా భాగస్వామిగా చేరింది. ప్రస్తుతం ఆన్ లైన్ లో నడుస్తోన్న ఈ కంపెనీని.. త్వరలోనే వివిధ నగరాల్లో స్టోర్స్ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ నాటికి మొదటి స్టోర్ ను లాంచ్ చేయనున్నారు. 


ఇక సినిమాల విషయానికొస్తే.. . ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'శాకుంతలం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలానే 'యశోద' అనే సినిమా సెట్స్ పై ఉంది. దీంతో పాటు ఓ బైలింగ్యువల్ సినిమా, ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఓకే చేసింది.