Why hasn't advance booking for Prabhas Salaar opened in Andhra Pradesh and Telangana?: సలార్... ఇప్పుడు కేవలం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న సినిమా! అందులోనూ యాక్షన్ ట్రైలర్ విడుదల చేసిన తర్వాత అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినిమా ఫీవర్ ఒక రేంజ్ అని చెప్పాలి.


ఏపీ, తెలంగాణలో ఎందుకు బుకింగ్స్ ఓపెన్ కాలేదు!?
అమెరికాలో 'సలార్' బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. నార్త్ ఇండియాలోనూ సేల్స్ స్టార్ట్ చేశారు. ఆఖరికి తమిళనాడులో కూడా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. చెన్నై సిటీలో తెలుగు షోస్ కూడా షెడ్యూల్ చేశారు. టికెట్స్ అమ్మకాలు ప్రారంభించారు. కానీ, ప్రభాస్ (Prabhas)కు పట్టున్న తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీలో ఇంకా టికెట్స్ అమ్మకాలు ప్రారంభించలేదు. ఎందుకు? అంటే... రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో టికెట్ రేట్స్ పెంచమని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్, డిస్ట్రిబ్యూటర్లతో పాటు ప్రభాస్ సన్నిహితులు రిక్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల, ఇంకా బుకింగ్స్ స్టార్ట్ కాలేదు.


Also Read: 'కెజియఫ్'లో చేసిన తప్పే మళ్ళీ 'సలార్'కు...


ఈ రోజు నుంచి బుకింగ్స్ మొదలు?
'సలార్' టికెట్ రేటును 50 రూపాయల వరకు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం జీవో రావచ్చు. మరోవైపు తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఏది ఏమైనా సరే... ఈ రోజు చర్చలు ముగుస్తాయని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బుకింగ్స్ ఓపెన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అయితే... రేటు ఎంత పెడతారు? అనేది చూడాలి. 


Also Readపది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!


ప్రభాస్ కథానాయకుడిగా... అతని స్నేహితుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన 'సలార్'కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. 'కెజియఫ్' చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ సంస్థపై భారీ నిర్మాణ వ్యయంతో విజయ్ కిరగందూర్ ప్రొడ్యూస్ చేశారు. 


Salaar cast and crew names : 'సలార్'లో ప్రభాస్ జోడీగా స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ ముద్దుల కుమార్తె శృతి హాసన్ నటించారు. జర్నలిస్ట్ ఆద్య పాత్రలో ఆమె కనిపించనున్నారు. ట్రైలర్ చూస్తే... ఓ షాట్ లో ఆమె కూడా ఉన్నారు. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది.


'సలార్' సినిమాలో ఇతర నటీనటుల విషయానికి వస్తే... ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటించారు. 'కెజియఫ్'లో కూడా ఆమె ఉన్నారు. అయితే... అందులో ఆమెది ముస్లిం పాత్ర. ఇందులో హిందూ పాత్ర! ఇక, కథలో కీలకమైన వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు నటుడు జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫీ బాధ్యతలు నిర్వర్తించారు.