సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు తీరిక దొరికితే విదేశాల్లో వెకేషన్ కు వెళ్తుంటారు. ఫ్యామిలతో కలిసి అక్కడి అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. మహేష్ బాబు, చిరంజీవి లాంటి టాలీవుడ్ స్టార్స్ తరచుగా కుటుంబ సభ్యులతో కలిసి ఫారిన్ వెకేషన్ లో సరదగా గడుపుతుంటారు. ఫ్యామిలీతో కలిసి అక్కడి వీధుల్లో తిరుగుతుంటారు. కానీ, దర్శకుడు రాజమౌళి తీరే సఫరేటు. ఆయన విదేశాలకు బదులుగా స్వదేశంలోనే హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.


తమిళనాడు వెకేషన్ లో జక్కన ఫ్యామిలీ


దిగ్గజ దర్శకుడు రాజమౌళి గత కొద్ది రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్నారు. అక్కడి ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పూర్తిగా దైవ చింతనలో మునిగిపోయారు. ఇటీవల తన కుటుంబంతో విహారయాత్రకు రాజమౌళి వెళ్లారు. అందమైన పర్యాటక ప్రాంతాల్లో  సేద తీరారు. తాజాగా తమిళనాడు పర్యటనను ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు టూర్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.


“నేను చాలా కాలంగా సెంట్రల్ తమిళనాడులో  రోడ్ ట్రిప్ వేయాలనుకున్నాను. నా కూతురుకు దేవాలయాలను సందర్శించే అలవాటు, ఇష్టం ఉన్నాయి. ఆమె కూడా మాకు తోడుగా వచ్చింది. కుటుంబ సభ్యులం అందరం కలిసి ఇటీవలే దేవాలయాలను సందర్శించడం ప్రారంభించాం. జూన్ చివరి వారంలో శ్రీరంగం, దారాసురం, బృహదీశ్వర కోయిల్, రామేశ్వరం, కణాదుకథాన్, తూత్తుకుడి, మదురైకి వెళ్ళాను. అద్భుతమైన వాస్తుశిల్పం, అద్భుతమైన ఇంజనీరింగ్, పాండ్యులు, చోళ రాజులు, అనేక ఇతర పాలకుల లోతైన ఆధ్యాత్మిక కట్టడాలు నిజంగా మంత్రముగ్ధులను చేశాయి. మంత్రకూడం, కుంభకోణంలో చక్కటి భోజనం చేశాం. రామేశ్వరంలోని కాకా హోటల్ మురుగన్ మెస్‌లో భోజనం చేశాం. అన్ని చోట్లా భోజనం అద్భుతంగా ఉంటుంది. నేను వారంలో 2-3 కిలోలు పెరిగాను. 3 నెలల విదేశీ ప్రయాణం, ఫుడ్ హాబిట్స్ తర్వాత.. హోమ్ ల్యాండ్ టూర్ చేయడంతో ఎంతో రిఫ్రెష్‌గా, ఉత్సాహంగా ఉంది” అని రాజమౌళి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన తమిళ ఆలయాలకు సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు.  






మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న జక్కన్న


‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో  ఆస్కార్ అవార్డులను సాధించిన రాజమౌళి, ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నారు. పాన్ వరల్డ్ మూవీగా రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా జక్కన్న ఈ చిత్రాన్ని తీర్చి దిద్దుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ఉండబోతుందని వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ 2024లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.  ఇక మహేష్ బాబుతో సినిమా అయ్యాక మహాభారతం సినిమాను రాజమౌళి తీసే చాన్స్ ఉందని కూడా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు దర్శకధీరుడు తీయబోయే ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద అందరి దృష్టి పడింది.  


Read Also: ముఖ్య నేతలతో వరుస భేటీలు- పొలిటికల్ ఎంట్రీపై విజయ్ కీలక చర్చలు!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial