శంకర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. చెర్రీ కెరీర్ లో 15వ సినిమాని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ కలసి నిర్మిస్తున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లబోయే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో...నటీనటుల ఎంపిక కూడా అదే స్థాయిలో ఉంటోందని టాక్. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు విలన్ రోల్ కి సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రతినాయకుడి పాత్ర కోసం మలయాళ నేచురల్ స్టార్ ఫహద్ ఫాజిల్ ని మేకర్స్ సంప్రదిస్తున్నారని అంటున్నారు.
ఈ మూవీకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు, సాయిమాధవ్ బుర్రా డైలాగ్ రైటర్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ. ఇది దిల్ రాజు బ్యానర్ లో వచ్చే 50వ సినిమా. అన్నటికీ మించి శంకర్ దర్శకత్వంలో వస్తున్న మొదటి తెలుగు ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరి ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి....
Also Read: ట్రిపుల్ ఆర్ విడుదల వాయిదా? రాజమౌళి పెట్టబోయే ప్రెస్మీట్ అందుకేనా?
Also Read: శ్రీదేవి సోడా సెంటర్లో గోలీ కొట్టిన మహేశ్ బాబు.. అదిరిపోయిందంటూ ట్వీట్
Also Read: అభిమాని చర్యకు చలించిపోయిన ప్రకాశ్రాజ్.. త్వరలోనే కలుస్తానని హామీ
Also Read: బాత్ టబ్లో విరిసిన ఎర్రగులాబీ.. తల్లి వల్ల సెలబ్రెటీగా మారిన తనయ...
Also Read: సముద్రం మధ్యలో రామ్ చరణ్ బ్యూటీ అందాల విందు