సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది చిత్రబృందం. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు ఇటీవల ఫ్యామిలీతో ట్రిప్ కి చెక్కేశారు. తనకు సమయం దొరికినప్పుడల్లా.. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు మహేష్. 


సమ్మర్ ట్రిప్ లో భాగంగా అందరూ కలిసి యూరప్ కి వెళ్లారు. అలానే ఇటలీ, న్యూయార్క్ సిటీకి కూడా వెళ్లినట్లు ఉన్నారు. నిజానికి ఈపాటికే మహేష్ రిటర్న్ అవ్వాల్సింది కానీ ఇప్పుడు ట్రిప్ ను పొడిగించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన ట్రిప్ కి సంబంధించిన కొన్ని ఫొటోలను, వీడియోలను మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. తాజాగా తన భార్య నమ్రతతో తీసుకున్న ఫొటోను షేర్ చేశారు మహేష్. 


న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ ఈ స్టార్ కపుల్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. 'సమ్మర్ నైట్స్, సిటీ లైట్స్' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోలో మహేష్ ఎప్పటిలానే హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫొటో వైరల్ అవుతోంది. బెస్ట్ పిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక సినిమాల విషయానికొస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు మహేష్. జూలై లేదా ఆగస్టు నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.