Oye Re-Release: టాలెంటెడ్ హీరో సిద్దార్థ్ హీరోగా, షామిలీ హీరోయిన్ గా నటించిన మూవీ ‘ఓయ్’. ఆనంద్ రంగ డైరెక్షన్ లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. 2009 లో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయినా, ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఈ సినిమాను వాలెంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ రీ రిలీజ్ చేశారు.  


ధియేటర్ లో డ్యాన్స్ తో అదరగొట్టిన యువతి


థియేటర్లలో ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. ఆడియెన్స్ ఈ సినిమా క్లిప్స్ షేర్ చేస్తూ  సోషల్ మీడియా వేదిగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2009లో ప్రేక్షకుల నుంచి అనుకున్న స్థాయిలో ఆదరణ లభించకపోయినా, రీ రిలీజ్ సందర్భంగా చాలా చోట్ల షోలు చాలా చోట్ల హౌస్ ఫుల్స్ అయ్యాయి. హైదరాబాద్ మొదలుకుని వైజాగ్ దాకా అన్ని చోట్ల ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. హీరోయిన్ షామిలికి సిద్దు పుట్టిన రోజు సందర్భంగా వరస కానుకలతో సర్ప్రైజ్ ఇచ్చే ఎపిసోడ్ కి ఈలలు కేకలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాటలకు సీట్ల నుంచి లేచి మరీ డాన్సులు చేస్తున్న వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వైజాగ్ లో ఓ యువతి స్క్రీన్ మీద పాట వస్తుంటే అదిరిపోయే డ్యాన్స్ వేస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. నెటిజన్స్ ఆమె జోష్ ఫుల్ డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు.  










డైరెక్టర్ ఆనంద్ రంగా ఏమ్నారంటే?


వాస్తవానికి 2009లో రిలీజైన ‘ఓయ్’ అప్పుడు అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. కావాల్సినంత ఎమోషన్ ఉన్నా, అభిమానులకు అంతగా ఎక్కలేదు. షామిలి పాత్రకు ‘గీతాంజలి’ తరహాలో ఎండింగ్ ఇవ్వడం ఆడియెన్స్ కు పెద్దగా నచ్చలేదు. సిద్దార్థ్ తన భావోద్వేగాలను గొప్పగా ప్రదర్శించినా, ఆనుకున్న స్థాయిలో ఆడియెన్స్ ఆదరించలేదు. ఈ సినిమా తర్వాత దర్శకుడు ఆనంద్ రంగా మరో సినిమా చేయలేదు. అయితే, యువన్ శంకర్ రాజా పాటలు మాత్రం బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు అప్పుడు పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా, రీ రిలీజ్ లో మాత్రం ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.  అంతేకాదు, ఇవాళ ప్రీమియర్లు వేస్తున్న ‘ఊరిపేరు భైరవకోన’ తర్వాత ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నది ‘ఓయ్’ మూవీకి మాత్రేమే కావడం విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ రంగ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. ‘గూస్ బంప్స్, హ్యాపీ టియర్స్, లవ్ యూ ఆల్’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  


Read Also: రూ. 170 కోట్లకు మించి ఇచ్చినా రాజీపడను, ‘శ్రీమంతుడు’ కేసుపై శరత్ చంద్ర హాట్ కామెంట్స్