Thaai Kizhavi OTT : 10 కోట్ల బడ్జెట్తో 80 కోట్లు - టాప్ ట్రెండింగ్ మూవీ తప్పక చూడాల్సిందే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Thaai Kizhavi OTT Platform : రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన సీనియర్ హీరోయిన్ రాధిక 'తాయి కిిళవి' టాప్ ట్రెండింగ్లో నిలిచింది. తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ అందుబాటులో ఉంది.

Radhika's Thaai Kizhavi Movie Top Trending On OTT : పదంటే పది కోట్ల బడ్జెటే. అయితేనే మంచి కంటెంట్తో ఆడియన్స్ మనసు దోచేసింది. బాక్సీఫీస్ వద్ద దాదాపు రూ.80 కోట్లు వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోష్ టాప్ వన్ ట్రెండింగ్లో నిలిచింది. సీనియర్ హీరోయిన్ రాధిక... వృద్ధురాలి పాత్రలో మాస్ లుక్లో కనిపించిన ఆ మూవీనే 'తాయి కిళవి'. ఓటీటీలోకి వచ్చిన 3 రోజుల్లోనే టాప్ స్థానం సొంతం చేసుకుంది.
తెలుగులోనూ స్ట్రీమింగ్
ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'తాయి కిళవి' బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ నెల 13 నుంచి ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ మూవీకి శివకుమార్ దర్శకత్వం వహించగా... రాధికతో పాటు అరుళ్ దాస్, రాయిచల్ రెబెకా, సింగం పులి, ఇళవరసు, మునీష్ కాంత్, బాల శరవణన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై తమిళ హీరో శివ కార్తికేయన్ మూవీని నిర్మించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాధిక... ఈ మూవీలో సరికొత్తగా కనిపించారు. ప్రతీ అమ్మాయి ఈ మూవీని తప్పకుండా చూడాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read : రామ్ చరణ్ మరో ఘనత - ఎస్క్వైర్ ఇండియా కవర్ పేజీపై గ్లోబల్ స్టార్... గ్రేట్ జర్నీ అంటూ...
స్టోరీ ఏంటంటే?
కడుపట్టి అనే విలేజ్లో పసుపుతాయి (రాధిక) అనే వృద్ధురాలు రుణాలిస్తూ ఉంటుంది. గ్రామంలో ఆమె అంటే అందరికీ హడలే. అందరూ ఆమె దగ్గర అప్పు తీసుకున్న వారే. వడ్డీ డబ్బుల కోసం ఆమె వస్తుందంటే ఎక్కడి వాళ్లు అక్కడ తప్పించుకుని తిరుగుతుంటారు. డబ్బు కోసం కట్టుకున్న భర్త వదిలేయడంతో కూతురు సురులు (రైచల్ రెబెకా), మనవడిని ఇంట్లోనే అట్టి పెట్టుకుని వారి బాగోగులు కూడా చూసుకుంటూ ఉంటుంది. ఒక రోజు పసుపుతాయికి పక్షవాతం వస్తుంది.
దీంతో ఆమె చనిపోతే ఆస్తి మొత్తం తమకే వస్తుందని కొడుకులు భావిస్తుంటారు. మంచంపై స్పృహ లేకుండా పడి ఉంటుంది. కొడుకులు కోడళ్లు, అల్లుళ్లు ఆమె ఎప్పుడు చనిపోతుందా? అని ఎదురు చూస్తుంటారు. నోట మాట రాక మంచం పై నుంచే సైగలు చేస్తుంది పసుపు తాయి. ఆమె ఎవరికీ తెలియకుండా 160 సవర్ల బంగారం దాచి పెట్టిందన్న రహస్యం ముగ్గురు కొడుకులకూ తెలుస్తుంది. మరి ఆ బంగారం ఎక్కడ దాచిందో తెలుసుకునేందుకు ఆరాట పడుతుంటారు. అమ్మకు సేవలు చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? తమ తల్లి బంగారం ఎక్కడ దాచిందో కొడుకులకు తెలిసిందా? వారికి ఎదురైన సవాళ్లేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























