Eesha OTT : ఓటీటీలోకి హెబ్బా పటేల్ హారర్ థ్రిల్లర్ 'ఈషా' - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Eesha OTT Platform : హెబ్బా పటేల్ రీసెంట్ హారర్ థ్రిల్లర్ 'ఈషా' ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటివరకూ ఇతర దేశాల్లో స్ట్రీమింగ్ అవుతుండగా... తాజాగా భారత్లో అందుబాటులోకి వచ్చింది.

Hebah Patel's Eesha OTT Streaming : హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, త్రిగుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'ఈషా'. గతేడాది చివర్లో డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 2 నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
హారర్ థ్రిల్లర్ 'ఈషా' ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం ఇతర దేశాల్లో అందుబాటులోకి వచ్చిన మూవీ శుక్రవారం నుంచి భారత్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహించిన ఈ మూవీలో సిరి హన్మంత్, పృథ్వీరాజ్ కీలకపాత్రలు పోషించారు. హెచ్వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కేఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పణలో పి హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.
View this post on Instagram
Also Read : 'అస్సీ' తెలుగు రివ్యూ - రేప్ కేస్, కోర్ట్ రూం డ్రామా ఎలా ఉంది? లాయర్గా తాప్సీ యాక్టింగ్ మెప్పించిందా?
స్టోరీ ఏంటంటే?
నయన (హెబ్బా పటేల్), కల్యాణ్ (త్రిగుణ్), అపర్ణ (సిరి హన్మంతు), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. అసలు దెయ్యాలు, ఆత్మలు లేనే లేవని బలంగా నమ్ముతుంటారు. మూఢ నమ్మకాల పేరుతో అమాయకుల్ని దోచుకునే బాబాలు, కొందరి చావులకు కారణమయ్యే మాంత్రికులు, దొంగ స్వామీజీలకు చెక్ పెట్టడమే పనిగా పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే వారికి ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉండే ఆది దేవ్ (పృథ్వీరాజ్) బాబా గురించి తెలుస్తుంది.
దీంతో ఆ బాబా పని పట్టేందుకు నలుగురూ అక్కడకు వెళ్తారు. వీరి గురించి తెలిసిన ఆది దేవ్ బాబా 'ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తా' అంటూ వారికే సవాల్ విసురుతాడు. ఇందులో భాగంగానే నలుగురు ఫ్రెండ్స్ ఓ పాడుపడిన బంగ్లాలో నివసించేందుకు రెడీ అవుతారు. అక్కడ వారికి వింత అనుభవాలు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ బంగ్లాలో దెయ్యాలున్నాయా? నలుగురి మిత్రులను చంపాలని ఓ గిరిజనుడి శరీరాన్ని ఆవహించిన పుణ్యవతి ఆత్మ కథేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
























