Vishnu Manchu: గాయం మానింది కానీ గుర్తులు చెరిగిపోలేదు... మంచు విష్ణు
Vishnu Manchu Injured: యాక్షన్ సన్నివేశాలు చేసేటప్పుడు హీరోలకు గాయాలు అవుతూ ఉంటాయి. అటువంటి ఓ గాయం, ఆ గాయం తాలూకా జ్ఞాపకం గురించి హీరో విష్ణు మంచు షేర్ చేశారు.

డేరింగ్ అండ్ డాషింగ్ కథానాయకుడు విష్ణు మంచి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అది వైరల్ అవుతోంది. 'కన్నప్ప'తో ఆయన పాన్ ఇండియా హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సాధారణంగా యాక్షన్ సన్నివేశాలు చేసేటప్పుడు హీరోలకు గాయాలు అవుతుంటాయి. అది తెలిసిన విషయమే. అటువంటి ఓ గాయం, ఆ గాయం తాలూకా జ్ఞాపకం గురించి ఆయన చెప్పుకొచ్చారు.
'కన్నప్ప' చిత్రీకరణలో విష్ణుకు గాయం!
'కన్నప్ప' సినిమా చిత్రీకరణ సమయంలో న్యూజిలాండ్లో విష్ణు మంచు గాయపడ్డారు. ఓ డ్రోన్ వచ్చి ఆయన భుజానికి తగిలిన ఘటన అప్పట్లో వైరల్ అయింది. అయితే గాయపడినా కూడా విష్ణు షూటింగ్ పోస్ట్ పోన్ చేయలేదు. ఆ వెంటనే మరుసటి రోజే షూటింగ్లో జాయిన్ అయ్యారు విష్ణు. ఇక ఇప్పుడు నాటి గాయాన్ని, ఆ రోజు జరిగిన ఘటనను, వాటికి సంబంధించిన విజువల్స్ను విష్ణు షేర్ చేశాడు.
''ఇప్పుడు గాయం మానింది... కానీ న్యూజిలాండ్ కన్నప్ప చిత్రీకరణలో జరిగిన ఘటనను ఎప్పటికీ మర్చిపోలేను.. యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న టైంలో ఓ డ్రోన్ వచ్చి నన్ను తాకింది.. దాని రెండు బ్లేడ్స్ నా భుజాన్ని కోసేశాయి... ఒక సర్జరీ జరిగింది... ఏడు లేజర్ కరెక్షన్స్ అయ్యాయి... గాయాలు మానుతాయి కానీ గుర్తులు, కథలు అలానే మిగిలిపోతాయి'' అని విష్ణు చేసిన కామెంట్, షేర్ చేసిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: Papam Prathap: అయ్యో పాపం... రాశి అనుకున్నది ఒక్కటి అయినది మరొకటి!
View this post on Instagram
భారీ బడ్జెట్తో తీసిన కన్నప్ప ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రియాక్షన్స్ పొందింది. విష్ణు మంచు గత చిత్రాలతో పోల్చితే 'కన్నప్ప' బెటర్ సినిమా అని ఆడియన్స్ ప్రశంసించారు. వంద కోట్ల వసూళ్లు వచ్చాయి. అయితే 'కన్నప్ప'కి పెట్టిన బడ్జెట్ ఎంత? అనేది మాత్రం విష్ణు మంచు బయట పెట్టలేదు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ వంటి భారీ తారాగణం ఉండటం ఎంతో కలిసి వచ్చింది.
'కన్నప్ప' తర్వాత విష్ణు మంచు తన తదుపరి చిత్రాలపై మరింత ఫోకస్ పెట్టారు. అవా ఎంటర్టైన్మెంట్స్ మీద కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇక విష్ణు నుంచి ఈ ఏడాది ప్రాజెక్ట్ రావడం అనేది కాస్త డౌట్గానే ఉంది. ఇంత వరకు విష్ణు తన కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఈ మధ్య దుబాయ్లో పరిస్థితులు బాగా లేకపోవడంతో విష్ణు తన ఫ్యామిలీతో సహా హైదరాబాద్కే వచ్చినట్టుగా తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు




















