Vijay Deverakonda Rashmika : రణబాలి కొత్త షెడ్యూల్కు కొత్త జంట - విజయ్ దేవరకొండ, రష్మిక కపుల్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే?
Virosh Couple : పెళ్లి తర్వాత విరోష్ కపుల్ 'రణబాలి' మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త షెడ్యూల్లో పెళ్లి తర్వాత కొత్త జంట షూటింగ్లో పాల్గొననున్నారు.

Virosh Couple Resuming Ranabaali Shoot After Marriage : స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక కపుల్ పెళ్లి తర్వాత తిరిగి 'రణబాలి' మూవీ షూటింగ్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి హడావిడి ముగియడంతో కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని రెగ్యులర్ వర్క్స్ ప్రారంభించనున్నట్లు సమాచారం.
14 రోజుల తర్వాత
రాజస్థాన్ ఉదయ్ పూర్లో ఫిబ్రవరి 26న విజయ్, రష్మిక జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ నెల 4న హైదరాబాద్ తాజ్ హోటల్లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఫ్యామిలీస్తో పాటు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ హాజరయ్యారు.
పెళ్లైన దాదాపు 2 వారాల తర్వాత విరోష్ ఇద్దరూ కలిసి 'రణబాలి' షూటింగ్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో ఇది మూడో మూవీ. ఇద్దరూ సినిమాలోనూ దంపతులుగానే నటిస్తున్నారు. ఈ నెల 9 నుంచి 'రణబాలి' షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుండగా... 12 నుంచి కొత్త జంట పాల్గొననున్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత న్యూ కపుల్ చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. వీరి పెళ్లి సందర్భంగా 'రణబాలి'లో విరోష్ జంటపై రిలీజ్ చేసిన సాంగ్ వైరల్ అవుతోంది.
Also Read : తిరుమల కొండపై బర్త్ డే సెలబ్రేషన్స్ - దివ్వెల మాధురి, తనూజలకు బిగ్ షాక్
గంభీరమైన లుక్లో 'రణబాలి'గా విజయ్ దేవరకొండ, అమాయకమైన అందమైన లుక్లో అతని భార్య జయమ్మగా రష్మిక లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బ్రిటిష్ కాలం నాటి ఆ పాత తరం లుక్ను 100 శాతం రీక్రియేట్ చేయడం వైరల్గా మారింది. 'ఏందయ్యా సామీ...' అంటూ అమాయక వివాహిత తన భర్తపై చూపించే ప్రేమను అద్భుతంగా ఈ పాటలో వ్యక్తం చేశారు.
ముచ్చటగా మూడోసారి...
'గీత గోవిందం' మూవీతో విజయ్ దేవరకొండ, రష్మిక బెస్ట్ పెయిర్ అనిపించుకున్నారు. ఆ టైంలోనే ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం సాగింది. ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ మూవీలోనూ ఇద్దరూ జంటగా నటించారు. ఈ రెండు మూవీస్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి 'రణబాలి' కోసం విరోష్ కపుల్ జత కట్టబోతున్నారు.
ఈ మూవీకి 'టాక్సీవాలా' ఫేం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. విజయ్, రష్మికలతో పాటు బ్రిటిష్ అధికారిగా ఆర్నాల్డ్ వోస్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అజయ్ అతుల్ మ్యూజిక్ అందిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా 'రణబాలి' మూవీని రూపొందించినట్లు అనౌన్స్మెంట్ వీడియోను బట్టి తెలుస్తోంది. వరల్డ్ వైడ్గా సెప్టెంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక విజయ్ దేవరకొండ 'రణబాలి'తో పాటే రవి కిరణ్ కోలా దర్శకత్వంలో 'రౌడీ జనార్ధన'లోనూ నటిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. అటు, రష్మిక 'మైసా' మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వారియర్గా నేషనల్ క్రష్ కనిపించనున్నారు.
ట్రెండింగ్ వార్తలు




















