Vijay Deverakonda's Ranabaali Action Sequence Leaked : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక జంటగా నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో జరుగుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ యాక్షన్ సీక్వెన్స్ లీక్ అయ్యింది. 

Continues below advertisement

రాయలసీమ యాసలో...

రీసెంట్‌గా ఏపీలోని అనంతపురం ప్రాంతంలో, అలాగే, కర్నూలులోని బనగానపల్లె మండలం కటికవానికుంట గ్రామంలో 'రణబాలి' (Ranabaali) షూటింగ్ జరిగింది. ఈ సందర్భంగా విజయ్‌పై ఓ యాక్షన్ సీక్వెన్స్‌పై షూట్ చేయగా ఆ వీడియో లీకైంది. ఇందులో రాయలసీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్ అదిరిపోయాయి. గుర్రంపై చేతిలో కొడవలితో పవర్ ఫుల్‌గా ఆయన చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. శత్రువులను ఊచకోత కోస్తూ... 'ము*** మోపి నా కొడకా.... ఏడున్నావ్ రా... నీ ఇంటికి వచ్చినా రా అప్పా సంపుదువ్ గానీ...' అంటూ రాయలసీమ యాస డైలాగ్స్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

Continues below advertisement

ఈ లీక్డ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ లుక్స్, డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నా సీన్ లీక్ కావడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కీలక సీన్స్ ముందే బయటకు వస్తే సస్పెన్స్, థ్రిల్ మిస్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మూవీ టీం ఇలాంటి వాటి పట్ల అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు, ఈ వీడియో సదరు మూవీ టీమే కావాలని లీక్ చేస్తుందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై టీం రియాక్ట్ కావాల్సి ఉంది.

Also Read : మన రామయ్య వచ్చేశాడు - శ్రీరాముడుగా రణబీర్ కపూర్ లుక్ చూశారా!

ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్ అదిరిపోయాయి. రణబాలిగా విజయ్ దేవరకొండ, అతని భార్య జయమ్మగా రష్మిక (Rashmika) నటిస్తున్నారు. రీసెంట్ వీరి వెడ్డింగ్ సందర్భంగా 'ఏందయ్యా సామీ' అంటూ సినిమాలో పెళ్లి వీడియో రిలీజ్ చేయగా ట్రెండ్ అవుతోంది. గంభీరమైన లుక్‌లో విజయ్, అమాయకంగా ఉన్నట్లు రష్మిక లుక్ అదిరిపోయింది.

విజయ్ దేవరకొండ, రష్మికలకు ఇది మూడో మూవీ. అంతకు ముందు వచ్చిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్‌తో విజయ్‌కు ఇది రెండో మూవీ. ఇదివరకు వీరి కాంబోలో వచ్చిన టాక్సీవాలా విజయం సాధించింది. బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు, ఆకలి చావులు, రాయలసీమలో తన వారిని కాపాడుకునేందుకు వారియర్ రణబాలి ఏం చేశాడు? అనేదే బ్యాక్ డ్రాప్‌గా మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. 1854 - 1878 మధ్య కాలంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా సెప్టెంబర్ 11న ఈ సినిమా రిలీజ్ కానుంది.