Uday Kiran: ఉదయ్ కిరణ్లో ఆ రెండు భయాలు ఎక్కువ... బయట పెట్టిన ఫ్రెండ్ & డైరెక్టర్
Uday Kiran Latest News: ఉదయ్ కిరణ్ అంటే అభిమానం చూపించే ప్రేక్షకులు ఎంతో మంది. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లి ఏళ్ళు గడుస్తున్నా అభిమానం తగ్గడం లేదు. ఆయన ఫ్రెండ్ తాజాగా ఉదయ్ కిరణ్ భయాలను బయటపెట్టారు.

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ (Uday Kiran) పేరు గుర్తు వచ్చినప్పుడల్లా తెలుగు ప్రేక్షకుల మనసు భారంతో నిండిపోతోంది. కెరీర్ ప్రారంభంలోనే వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి సంచలనం సృష్టించి ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడంపై ఆయన అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్షకులు సైతం సానుభూతి వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇటీవల వాలెంటైన్స్ డేకి రీ రిలీజ్ అయిన 'మనసంతా నువ్వే' సినిమాకు ఈ తరం యువతరం కూడా బ్రహ్మరధం పట్టింది. ఆ సందర్భంగా ఆ సినిమా డైరెక్టర్ ,ఉదయ్ కిరణ్ తో రెండు సినిమాలు (మనసంతా నువ్వే, శ్రీ రామ్ ) తీసిన V. N. ఆదిత్య... ఉదయ్ కిరణ్ తో తన అనుబంధం గురించి, 'మనసంతా నువ్వే' సినిమా విశేషాల గురించి పంచుకున్నారు.
ఉదయ్ కిరణ్ కు ఆ రెండు భయాలు ఉండేవి
'మనసంతా నువ్వే' ఉదయ్ కిరణ్ కు హ్యాట్రిక్ మూవీ. దానికంటే ముందు తేజ దర్శకత్వం లో 'చిత్రం', 'నువ్వే నువ్వే' లాంటి రెండు పెద్ద హిట్స్ ఉన్నాయి. అయితే ఆ రెండింటిలో లేని కొన్ని ఎమోషనల్ సీన్స్ 'మనసంతా నువ్వే'లో ఉదయ్ తో చేయించారు ఆదిత్య. వాటిలో ఒకటి సినిమాలో సెకండ్ హీరోయిన్ తను రాయ్ స్నేహితురాలి ఇంట్లో జరిగే పెద్ద మనిషి పండుగలో మంగళ హారతి పాడే సన్నివేశం ఉంటుంది. అమ్మాయిలందరి మధ్య మంగళ హారతి పాడుతుంటే థియేటర్ లో ఆడియన్స్ నవ్వుతారేమో అనే ఉదయ్ కిరణ్ విపరీతంగా భయపడ్డాడు అట. అలానే సినిమా చివర్లో విలన్ పాత్ర వేసిన తనికెళ్ళ భరణితో 'చిన్నప్పుడు నిన్ను కొడదాం అనుకుంటే అమ్మ అడ్డు వచ్చింది. ఇప్పుడు కొడదాం అనుకుంటే చెల్లి అడ్డు వచ్చింది' అనే డైలాగ్ చెప్పేటప్పుడు కూడా అంతే భయపడ్డాడు అట. ఆ సినిమాకు ముందు చేసిన 'నువ్వు నేను'లో 'ఈ పెద్దోళ్ళు ఉన్నారే' అనే డైలాగ్స్ మీద జోక్స్ గట్టిగా ఉండేవి. దానితో మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందేమో అని ఆందోళనకు గురయ్యాడట ఉదయ్ కిరణ్. థియేటర్ లో 'మనసంతా నువ్వే' ఫస్ట్ షో నడుస్తుండగా పక్కనే కూర్చున్న డైరెక్టర్ ఆదిత్య చెయ్యి గట్టిగా పట్టేసుకుని భయపడుతుండగా "ఏం కాదులే బాగా చేసావ్" అంటూ ఆయన ధైర్యం చెప్పారు అట. కానీ ఆ సీన్ థియేటర్లో బాగా పేలడంతో ఉదయ్ కిరణ్ రిలీఫ్ గా ఫీల్ అయినట్టు VN ఆదిత్య ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. మనసంతా నువ్వే ఎంత పెద్ద హిట్ అంటే ఈ సినిమాను కన్నడ, తమిళ, హిందీ భాషలతో సహా బంగ్లాదేశ్ లోనూ రీమేక్ చేశారు. 'చిత్రం' నటించిన రీమా సేన్ ఈ సినిమా లోనూ ఉదయ్ పక్కన నటించడం తో వీరిది హిట్ పెయిర్ గా ముద్ర పడింది.
'మనసంతా నువ్వే' తరువాత 'శ్రీ రామ్'
'మనసంతా నువ్వే' సినిమా తరువాత ఉదయ్ కిరణ్ హీరోగా మరో సినిమా 'శ్రీ రామ్' తీశారు డైరెక్టర్ V.N.ఆదిత్య. ఆ మూవీతో ఉదయ్ కిరణ్ ను యాక్షన్ హీరోగా ప్రెజెంట్ చేశారు. దానిలో ఉదయ్ కిరణ్ తో 'నువ్వే నువ్వే'లో నటించిన అనిత హీరోయిన్. ఆ సినిమా కూడా డీసెంట్ హిట్ అయింది. కొన్నేళ్ల గ్యాప్ తరువాత ఉదయ్ కిరణ్ తో మరో సినిమా తీసే ఆలోచనలో ఉన్న తనకు ఉదయ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిన సంగతి తెలిసి షాక్ కు గురయినట్టు చెప్పుకొచ్చారు V N ఆదిత్య.























