This Week Theatrical Releases Telugu Complete List : మే ఫస్ట్ వీక్‌లో దాదాపు 5 సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. హాట్ సమ్మర్‌లో కూల్ ఎంటర్టైన్మెంట్ అందించేదుకు కొత్త మూవీస్ రాబోతున్నాయి. ఇందులో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌తో పాటు క్రైమ్ థ్రిల్లర్స్ కూడా ఉన్నాయి. స్పిరిట్ మూవీ కూడా ఈ వారం రిలీజ్ కానుంది. అయితే, ఇది ప్రభాస్, సందీప్ వంగా కాంబో 'స్పిరిట్' కాదు. రైతుల నేపథ్యంలో సాగే స్టోరీతో రానున్న చిత్రం. 

Continues below advertisement

మెగా కోడలి 'సతీ లీలావతి'

మెగా కోడలు లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సతీ లీలావతి'. ఈ మూవీకి తాతినేని సత్య దర్శకత్వం వహించగా... ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. సీనియర్ హీరో నరేష్, సప్తగిరి, వీటీవీ గణేష్, మొట్ట రాజేంద్రన్, జాఫర్, జోషి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మించగా... మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Continues below advertisement

వయలెన్స్ పీక్... 'రేజర్'

నటుడు, దర్శకుడు రవిబాబు ప్రధాన పాత్రలో నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్ హై వయలెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'రేజర్'. ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాంగ్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్రం ఇది. ఓ చిన్నారిని కాపాడేందుకు రవిబాబు సృష్టించిన వయలెన్స్ అంతా ఇంతా కాదు. టీజర్, ట్రైలర్‌లో రక్తపాతం పాళ్లు మామూలుగా లేదు. రవిబాబుతో పాటు తనీష్, నటుడు బెనర్జీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 8న వరల్డ్ వైడ్‌గా మూవీ రిలీజ్ కానుంది.

గోదారి గట్టుపైన...

'మేమ్ ఫేమస్' ఫేం, యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటించిన లేటెస్ట్ రూరల్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన'. సుభాష్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీలో జగపతి బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్ ఇతర తారాగణం. ఆల్రెడీ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : యశ్‌తో బోల్డ్ సీన్స్ - ట్రిమ్ చేయాలని కియారా రిక్వెస్ట్... వైరల్ వార్తల్లో నిజమెంత?

Also Read : బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి

రిషబ్ శెట్టి 'ఏ ఫిల్మ్ బై గిరి'

కాంతార ఫేం రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'ఏ ఫిల్మ్ బై గిరి'. కరణ్ అనంత్, అనిరుధ్ మహేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో... రిషబ్ సరసన రచనా ఇందర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎన్ పి తపస్విని, ప్రమోద్ శెట్టి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 8న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

రైతుల నేపథ్యంలో 'స్పిరిట్'

రైతు దంపతులు నర్సమ్మ, వెంకటేశ్వర్లు కలిసి నిర్మించిన లేటెస్ట్ సోషల్ డ్రామా 'స్పిరిట్'. గొర్రెలు కాచుకుంటూ జీవనం సాగించే సాధారణ రైతుల దంపతులు సినిమాపై ఇష్టంతో ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీకి సీహెచ్ రవీంద్రనాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రవిబాబు, సత్య ప్రకాష్, చిత్రం శ్రీను, గడ్డం నవీన్, జూనియర్ రాజశేఖర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 8th వండర్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.