Ashu Reddy Case : అషు రెడ్డికి బిగ్ షాక్ - హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు
Ashu Reddy Reaction : బిగ్ బాస్ ఫేం, నటి అషు రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. పెళ్లి పేరుతో NRIను మోసగించారన్న ఆరోపణలపై విచారణను నిలిపేయాలన్న ఆమె పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.

Telangana High Court Rejects Stay In Ashu Reddy Case : బిగ్ బాస్ ఫేం, నటి అషు రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పెళ్లి పేరుతో ఓ ఎన్ఆర్ఐను రూ.9.35 కోట్ల మేర మోసం చేశారంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు నిలిపేయాలన్న ఆమె పిటిషన్ను హైకోర్టు రిజెక్ట్ చేసింది. తనపై, తన తల్లి యశోద రెడ్డిపై విచారణ నిలిపేయాలని ఆమె పిటిషన్ వేయగా అందుకు కోర్టు నిరాకరించింది. కఠిన చర్యల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా కోర్టు అంగీకరించలేదు.
రంగంలోకి దిగిన పోలీసులు
హైకోర్టు ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. స్టే విధించాలన్న అషు రెడ్డి పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం... దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని తెలిపింది. చట్టపరమైన ప్రక్రియ అనుసరించాల్సిందేనంటూ స్పష్టం చేయడంతో అషు రెడ్డి తల్లి కూడా కేసు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
అషు రెడ్డికి సంబంధించి బ్యాంక్ లావాదేవీలు స్పష్టంగా ఉన్నాయంటూ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దాదాపు రూ.10 కోట్ల నగదు ఆన్ లైన్ ద్వారానే ట్రాన్స్ఫర్ అయ్యిందని కోర్టుకు తెలిపారు. విచారణ జరగాల్సి ఉన్నందున... ఇప్పటికే పిటిషనర్కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం దర్యాప్తుపై స్టే విధించేందుకు నిరాకరిస్తూ విచారణ కంటిన్యూ అయ్యేలా ఆదేశాలిచ్చింది.
Also Read : శుక్రవారం ఓటీటీల్లో సినిమాల సందడి - డెకాయిట్ నుంచి వాలా 2 వరకూ... ఈ మూవీస్ డోంట్ మిస్
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ షేక్ పేటకు చెందిన సత్యనారాయణ... తన కుమారుడిని పెళ్లి పేరుతో అషు రెడ్డి మోసం చేసిందంటూ పోలీసులను ఆశ్రయించారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన తన కొడుకు ధర్మేంద్రను రూ.9.35 కోట్ల మేర మోసగించిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2018లో ధర్మేంద్ర భారత్కు వచ్చిన టైంలో పరిచయం చేసుకుని ప్రేమ, పెళ్లి పేరుతో డబ్బులు అడిగిందని చెప్పారు. కార్లు, ఆస్తులు, బంగారం కొనుగోలు చేసి తన పేరిట రిజిస్టర్ చేయించుకుందని ఆరోపించారు. పెళ్లి పేరెత్తితే మాత్రం తప్పించుకు తిరుగుతుందని తెలిపారు.
దీంతో అషు రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు, తన పరువుకు భంగం కలిగించేలా వార్తలు రాయడం నిలిపేయాలంటూ అషు రెడ్డి కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన న్యాయస్థానం... ఆమె పరువుకు భంగం కలిగేలా ఎలాంటి వార్తలు రాయొద్దని ఆదేశించింది. అయితే, కేసు విచారణను నిలిపేయాలన్న పిటిషన్పై మాత్రం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.
అషు రెడ్డి వాదన ఏంటంటే?
ఈ కేసుకు సంబంధించి అంతకు ముందు కోర్టులో అషు రెడ్డి వాదనలు వినిపించారు. ఇద్దరి మధ్య పెళ్లికి కానీ, లెక్కలకు కానీ సంబంధించిన రాతపూర్వక అగ్రిమెంట్స్ లేవని... ఆయన ఇష్టపూర్వకంగానే ఆ ఖర్చులు చేశారని వాదించినట్లు తెలుస్తోంది. తనను, తన కుటుంబాన్ని పెళ్లికి ఒప్పించే క్రమంలో, తన ఫ్యామిలీని మచ్చిక చేసుకునేందుకే అవన్నీ ఖర్చు చేసినట్లు పేర్కొందట. ఆ ఖర్చులకు తాను బాధ్యత వహించబోనని చెప్పినట్లు సమాచారం. ఇక హైకోర్టు ఆదేశాలతో విచారణ సాగుతున్న క్రమంలో ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















