Taapsee Pannu About South Industry : 'ఝమ్మంది నాదం' మూవీతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకున్న బ్యూటీ తాప్సీ. ఆ తర్వాత వరుస మూవీస్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. ప్రభాస్‌తో 'మిస్టర్ పర్ఫెక్ట్', రవితేజతో 'వీర', గోపీచంద్‌తో సాహసం, ఆనందో బ్రహ్మ, గుండెల్లో గోదారి ఇలా హిట్ మూవీస్‌లో నటించింది. ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్ మూవీస్ వైపు మళ్లింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో కాస్త గ్యాప్ వచ్చినా ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా మారింది.

Continues below advertisement

తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ బాలీవుడ్ కోర్ట్ రూం డ్రామా 'అస్సీ' బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ మూవీలో కని కుస్రుతి కీలక పాత్ర పోషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీ గురించి తాప్సీ షాకింగ్ విషయాలు వెల్లడించారు. 

'అది చాలా అవమానం'

Continues below advertisement

దక్షిణాది ఇండస్ట్రీలో షూటింగ్ టైంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను షేర్ చేసుకున్నారు తాప్సీ. 'గ్లామర్ సీన్స్, సాంగ్స్‌కు సంబంధించి మరింత అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్యాడెడ్ బ్రా ధరించాలని చెప్పేవారు. ఫిల్మ్ మేకర్స్ అలా ఒత్తిడి చేసే వారు. షూటింగ్ సెట్‌లో అందరి ముందూ అలాంటి మాటలు చెప్తే ఎలా అసౌకర్యంగా ఉంటాయో ఓ మహిళగా నాకు తెలుసు. ఏదైనా సాంగ్స్ చేస్తున్నప్పుడు అందరూ గమనిస్తే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది.' అంటూ కామెంట్స్ చేశారు.

'నాభిపై ఎక్కువ ఫోకస్'

అంతే కాకుండా సౌత్, భోజ్‌పురి సినీ ఇండస్ట్రీల్లో పాటల్లో ఎక్కువగా నాభిపై ఫోకస్ చేస్తుంటారని చెప్పారు తాప్సీ. 'హీరోయిన్ల నాభిపై ఎక్కువగా దృష్టి పెడతారు. అసలు ఫోకస్ ఎక్కువగా అక్కడ ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. హిందీ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో నాభిపై ఫోకస్ ఉండదని నేను చెప్పడం లేదు. అయితే, సౌత్ సినిమాల్లో ఉన్నంతగా ఉండదని మాత్రం నేను చెప్పగలను.' అని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read : 'కోర్ట్' జంట ఎనర్జిటిక్ స్టెప్పులు - రాము రాథోడ్ వాయిస్... ట్రెండింగ్ లిరిక్స్ చూశారా?

గతంలోనూ సౌత్ పరిశ్రమపై తాప్సీ చేసిన కామెంట్స్ వైరలయ్యాయి. సౌత్ మూవీస్‌లో నటించడం వల్ల తనకు గుర్తింపు రాలేదన్నారు. స్టార్ హీరోయిన్‌గా కొనసాగినా సంతృప్తి అనిపించిన క్యారెక్టర్స్ రాలేదని అన్నారు. టాలీవుల్‌లో ఆమె 2022లో వచ్చిన 'మిషన్ ఇంపాజిబుల్' మూవీలో నటించారు. ఆమె నటించిన ఇంటెన్సివ్ కోర్ట్ డ్రామా 'అస్సీ' ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె 'భారత భాగ్య విధాత' అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు.