Sree Vishnu Om Bheem Bush Trailer: హీరో శ్రీ విష్ణు సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. అతడి సినిమాలో ఏదోక ఆసక్తికర పాయింట్‌ ఉండేలా జాగ్రత్త పడతాడు ఈ హీరో. రోటిన్‌గాకు భిన్నమైన జానర్‌తో తన ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ని అలరిస్తుంటాడు. అందుకే శ్రీ విష్ణు సినిమా టైటిల్స్‌ కూడా అలాగే కొత్తగా, వింతగా ఉంటాయి. అతడి సినిమా అనౌన్స్‌మెంట్‌ వస్తే చాలు ఆడియన్స్‌ అంచనాలు పెరిగిపోతాయి. సినిమా సినిమాకి ఈ హీరో ప్రయోగం చేస్తుంటాడు. అలా ఈసారి వైవిధ్యమైన పాయింట్‌తో 'ఓం భీమ్‌ బుస్' అంటూ వస్తున్నాడు.


గతంలో శ్రీవిష్ణు నటించిన 'బ్రోచేవారెవరురా' ప్రధాన పాత్రలతోనే మళ్లీ 'ఓం భూమ్‌ బుస్' రిపీట్‌ అయ్యింది.'బ్రోచేవారెవరురా'తో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఆడియన్స్‌ కడపుబ్బా నవ్వించారు. ఇప్పుడు 'ఓం భీమ్‌ బుస్' మళ్లీ నవ్వించేందుకు వస్తున్నారు. 'హుషారు', 'రౌడీ బాయ్స్' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్ పతాకంతో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్‌, టీజర్‌, ఫస్ట్‌లుక్‌ మూవీ అంచాలు పెంచేస్తున్నాయి.


ట్రైలర్ ఎలా ఉందంటే..


మార్చి 22న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ యూనిట్‌ నేడు ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. తాజాగా రిలీజ్‌ అయిన ఈ ట్రైలర్‌ మూవీపై అంచనాలు పెంచెస్తోంది. ఫుల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా ట్రైలర్‌ సాగింది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ సైంటిస్టులుగా, దెయ్యాలు వెళ్లకొంటే స్వామిజీలు, డాక్టర్లుగా అల్ రౌండర్ల అవతారం ఎత్తారు.  సైంటిస్టుల డ్రెస్‌లో ఓ ప‌ల్లెటూరికి వచ్చిన వారిని ఆ ఊరంతా వింత‌గా చూడ‌టం, ద‌య్యాలు వ‌దిలించే వాళ్లు అనుకోవ‌డం లాంటి కామెడీ సన్నివేశాలు ట్రైలర్ ఫుల్ గా చూపించారు. మొత్తానికి ట్రైలర్ అవుట్ అండ్ కామెడీతో ఆడియన్స్‌ని కడుపుబ్బా నవ్వించేలా ఉంది. ఆల్‌ ప్రాబ్లమ్స్‌ వన్‌ సొల్యూషన్‌ అంటూ రచ్చ రవి డైలాగ్‌తో ట్రైలర్‌ సాగింది.  ఆ తర్వాత ఈ ముగ్గురు ఆ ఊళ్ల చేసిన రచ్చ, హంగామా  సినిమాలో ఎలా ఉందో ట్రైలర్ ద్వారా శాంపుల్ చూపించారు.



ఆడియన్స్‌కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌తో..


'ఓం భీమ్‌ బుష్‌'ట్రైలర్‌ లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయ‌ని అనిపిస్తోంది. ఇటు కామెడీ, అటు హార‌ర్ రెండు క‌లిపి తీస్తున్న‌ట్లుగా అనిపిస్తుంది. మ‌రి సినిమా ఎలా ఉండ‌బోతుందో తెలియాలంటే మార్చి 22న థియేట‌ర్ల‌కు వెళ్లి చూడాల్సిందే. ఈ సినిమాలో ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. శ్రీ‌కాంత్ అయ్యంగార్, అదిత్య మీన‌న్, ర‌చ్చ‌ర‌వి త‌దితరులు ముఖ్య  పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్ పతాకంతో కలిసి సునీల్ బలుసు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమాని. శ్రీ‌కాంత్ రామిశెట్టి ఆర్ట్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, స‌న్నీ ఎంఆర్ మ్యూజిక్ అందించారు. కూర్పు విష్ణు వర్షన్, సినిమాటోగ్ర‌ఫీ రాజ్ తోట. ఇక ఈ సినిమా ద‌ర్శ‌కుడు 'హుషారు' సినిమాతో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాడు. దీంతో 'ఓం భీం బుష్' కూడా ఆ త‌ర‌హాలోనే ఉంటుంద‌ని తెలుస్తోంది. టీజ‌ర్, ట్రైలర్‌ కూడా ఆ రేంజ్‌లోనే ఉండటంతో మూవీపై అంచ‌నాలు పెరిగిపోయాయి.