Nagarjuna: 'కూలీ'లో మాస్ విలన్ రోల్లో కింగ్ నాగార్జున - అక్కినేని కోడలు శోభిత రియాక్షన్ వైరల్
Sobhita Dhulipala: రజినీకాంత్ 'కూలీ' మూవీలో సైమన్గా నెగిటివ్ రోల్లో నాగార్జున మాస్ లుక్కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అక్కినేని కోడలు శోభిత మామయ్యపై ప్రశంసలు కురిపించారు.

Sobhita Dhulipala Reaction On Nagarjuna Look In Coolie Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ' ట్రైలర్ ట్రెండింగ్ అవుతోంది. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రజినీకాంత్ పవర్ ఫుల్ లుక్తో పాటు కింగ్ నాగార్జున మాస్ ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది. ఫస్ట్ టైం ఆయన విలన్ రోల్లో నటించారు.
అక్కినేని కోడలు రియాక్షన్
నాగార్జున మాస్ లుక్కు ఆయన కోడలు శోభిత ఫిదా అయ్యారు. మామయ్యపై ప్రశంసలు కురిపిస్తూ ఇన్ స్టా స్టోరీ పోస్ట్ చేశారు. 'సెమ్మా మాస్ (పెద్దదిగా ఉండేది) కిల్లింగ్ దెమ్ సాఫ్ట్లీ మావయ్య' అంటూ ట్రైలర్ నాగార్జున పోస్టర్ పంచుకోవడం సహా కిరీటం సింబల్స్ను జోడించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
'కూలీ'లో సైమన్గా నెగిటివ్ రోల్లో కనిపించారు నాగార్జున. ట్రైలర్ ఎంట్రీలోనే మాస్ డైలాగ్తో గూస్ బంప్స్ తెప్పించారు. 'ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలని తల మీద రాసిపెట్టి ఉంటది.' అనే డైలాగ్తో హై మాస్ ఎలివేషన్ ఇచ్చారు లోకేశ్. ఆయుధాలతో నాగార్జున కనిపించిన తీరు ఇదివరకూ ఎన్నడూ చూడని రోల్లో ఆయన్ను చూడబోతున్నామని అర్థమవుతోంది.
Also Read: 'గాడ్ ఫాదర్' తర్వాత 15 సినిమాలు వదిలేశా... నేను డబ్బుల కోసం చేయట్లేదు: సత్యదేవ్ ఇంటర్వ్యూ
వంద భాషాలతో ఈక్వెల్
'కూలీ' మూవీ రజినీకాంత్ వంద 'భాషా'లతో సమానమంటూ నాగార్జున చెప్పారు. దీంతో అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి. అందరికీ నచ్చేలా తన రోల్ను డైరెక్టర్ లోకేశ్ డిజైన్ చేశారని... చెన్నైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తెలిపారు. రజినీ ఫ్యాన్స్కు ఈ మూవీ ఓ ఫైర్ వర్క్ అని... ఓ పవర్ ప్యాక్ట్ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కించారని అన్నారు.
ట్రెండింగ్లో ట్రైలర్
'కూలీ' ట్రైలర్ యూట్యూబ్ను షేర్ చేస్తూ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. 'దేవా' రోల్ తలైవా రజినీకాంత్ కనిపించనుండగా... ఆయన ఎంట్రీ, యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవల్లో ఉన్నాయి. పోర్ట్ ఏరియాలో జరిగే స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్ను బట్టి తెలుస్తోంది. 'దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావురా...' అంటూ తలైవా చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అసలు పోర్ట్ ఏరియాలో ఏం జరుగుతోంది? మెడికల్ మాఫియానా? గోల్డ్ స్మగ్లింగా? వెపన్స్ స్మగ్లింగా? అనేది ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా ట్రైలర్తో అది పదింతలైంది.
ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్
ఈ మూవీని రజినీకాంత్, నాగార్జునతో పాటు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. వీరితో పాటే సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో కళానిధి మారన్ మూవీని నిర్మించారు. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో భారీగా ప్రేక్షకుల ముందుకు రానుంది.





















