సోషల్ మీడియా బాగా వాడకంలోకి వచ్చిన తర్వాత నుంచి సెలబ్రిటీల విషయంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా అది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఇప్పటికే చాలామంది సెలెబ్రెటీల విషయంలోనూ ఇదే జరిగింది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ (Sara Ali Khan), టీమిండియన్ యంగ్ క్రికెటర్ శుబ్ మన్ గిల్ (Shubman Gill) విషయంలోనూ ఇదే జరిగింది. బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్, టీమిండియా క్రికెటర్ శుబ్ మాన్ గిల్ ఇద్దరూ గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారని వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఓ హోటల్లో కలుసుకోవడమే ఈ వార్తలకు మూల కారణం. ఇక ఆ తర్వాత ఈ జంట ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్నారని, గంటల తరబడి మాట్లాడుకున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ జంట బంధానికి తెర పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఇద్దరూ ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేయడం హాట్ టాపిక్ గా మారింది.


గతంలో కూడా చాలామంది సెలబ్రిటీలు ఇలా సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడం, ఆ తర్వాత బ్రేకప్ చేసుకోవడం, విడాకులు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సారా అలీ ఖాన్, శుబ్ మన్ గిల్ విషయంలోనూ ఇదే జరిగింది. తాజాగా ఈ జంట ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పలు అనుమానాలు రేకెత్తున్నాయి. ఈ క్రమంలోనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో శుబ్ మన్ గిల్ డేటింగ్ లో ఉన్నారని అందుకే సారా అలీ ఖాన్ తో శుబ్ మన్ గిల్ బ్రేకప్ చేసుకున్నడంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజానికి సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో శుభమన్ గిల్ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వచ్చిన సమయంలోనే సారా అలీ ఖాన్ తో శుబ్ మన్ గిల్ బయట కనిపించాడు. దాంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ రిలేషన్ లోనే ఉన్నారని వినికిడి. అయితే తాజాగా వీరి బంధానికి శుభం కార్డు పడినట్లు సమాచారం.


Also Read : నిఖిల్‌తో రామ్ చరణ్ సినిమా - ఇక విప్లవం మొదలు


ఇక సారా అలీ ఖాన్ ఇప్పటికే బాలీవుడ్లో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించినప్పటికీ తన నటనతో ఆకట్టుకుంది. పైగా ఆమె స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు కావడంతో బాలీవుడ్ లో ఆమెకు వరుస ఆఫర్లు కూడా వస్తున్నాయి. రీసెంట్ గా ఫ్రాన్స్ లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక శుబ్ మన్ గిల్ విషయానికి వస్తే లేటెస్ట్ ఐపీఎల్ సీజన్లో మెరుపులు మెరిపిస్తున్నాడు. తాజాగా జరిగిన క్వాలిఫైయర్ 2 లోనూ ముంబైపై ఏకంగా 60 బంతుల్లో 129 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ సీజన్లో గిల్ ఏకంగా మూడు సెంచరీలు పూర్తి చేసుకోవడం విశేషం. దీంతో ఇప్పుడు చెన్నై తో మే 28న జరగబోతున్న ఫైనల్ మ్యాచ్లో శుబ్ మన్ గిల్ బ్యాటింగ్ పైనే అందరి ఫోకస్ ఉంది.


Also Read : ఎన్టీఆర్ కెరీర్ మలుపు తిప్పిన సినిమాలు - తెలుగులో కొత్త ట్రెండ్ సెట్ చేశాయ్!