Rajamouli Reaction Over Varanasi Shooting Update : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజువల్ వండర్ వారణాసి. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీ గురించి టైటిల్ గ్లింప్స్ తప్ప ఇప్పటివరకూ ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ తర్వాత మెక్సికో ఈవెంట్‌లో రాజమౌళి వారణాసి గురించి మాట్లాడారు. తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షూటింగ్ అప్డేట్ ఇచ్చారు.

Continues below advertisement

నాలుగు నెలల్లో...

మరో నాలుగు నెలల్లో వారణాసి షూటింగ్ పూర్తి చేస్తానని చెప్పారు రాజమౌళి. ఫ్రాన్స్‌లో జరిగిన ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్‌లో పాల్గొన్న జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'వారణాసి మేజర్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ కంప్లీట్ చేశాం. ముఖ్యమైన సీన్స్ షూటింగ్ కూడా పూర్తైంది. ప్రస్తుతం చిన్న చిన్న సీన్స్ షూట్ చేస్తున్నాం. ఈ ఏడాది సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేస్తాం.' అని చెప్పారు.

Continues below advertisement

ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో మూవీని రూపొందించడంపైనా రాజమౌళి రియాక్ట్ అయ్యారు. ఈ స్టోరీ ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో అయితేనే అద్భుతంగా ఉంటుందని... ఫస్టే అనుకున్నట్లు చెప్పారు. అయితే, ఈ ఫార్మాట్ కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదని క్లారిటీ ఇచ్చారు.

Also Read : Rahul Ravindran Chinmayi : పుణె మర్డర్‌పై బాయ్ ఫ్రెండ్ మూవీ - నెటిజన్‌కు రాహుల్ రిప్లై... సెటైరికల్ క్వశ్చన్‌కు చిన్మయి కౌంటర్

ఫోకస్ ఆన్ గ్రాఫిక్స్

ఇప్పటికే కెన్యా, అంటార్కిటికా, ఒడిశా, సహా హైదరాబాద్ శివారు ప్రాంతాలు, రామోజీ ఫిల్మ్ సిటీల్లో కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు రాజమౌళి. ప్రస్తుతం షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇవ్వగా... మహేశ్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ట్రిప్ వెళ్లారు. షూటింగ్ తర్వాత VFX, గ్రాఫిక్ వర్క్స్‌పై ఫోకస్ చేయనున్నారు. మూవీలో రామాయణం సీక్వెన్స్ హైలెట్ అని చెప్పారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. కుంభకర్ణుడు, శ్రీరాముడు మధ్య వార్ సీన్ 30 నిమిషాలు ఉంటుందని లేటెస్ట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. 

ఒక సీన్ కోసం 90 టేక్స్ తీసుకున్నా పూర్తి కాలేదని... ఆ తర్వాత రోజు రాజమౌళి షూట్ చేశారని మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. లంచ్ బ్రేక్ కూడా కేవలం 20 నిమిషాలే అని... రాజమౌళి సర్ విజన్‌తో వర్క్ చేస్తున్నారని తెలిపారు. సినిమాలో మహేశ్ రుద్రుడు, శ్రీరాముడిగా కనిపించనుండగా... విలన్ రణకుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా... దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ వెరీ డెడికేటెడ్ - కారవాన్స్, అసిస్టెంట్స్ ప్రచారంపై రణబాలి ప్రొడ్యూసర్స్ సీరియస్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.