Raj Tarn React on Lavanya Abortion: గతకొద్ది రోజులుగా రాజ్‌ తరుణ్ మీడియా ముందుకు రావడం లేదనే విషయం తెలిసిందే. తన మాజీ ప్రియురాలు లావణ్యతో వివాదం గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. గత రెండు వారాలకు సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌లో వీరి గురించి చర్చ, రచ్చ జరుగుతుంది. లావణ్యతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రాజ్ తరున్ అంటుంటే.. నా భర్త నాకు కావాలి అంటూ లావణ్య డిమాండ్‌ చేస్తుంది. ఏం మాట్లాడలేకే రాజ్ తరుణ్‌ మొహం చాటేసాడని, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్‌ పెట్టుకున్నాడంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తుంది. తరచూ యూట్యూబ్‌ ఛానళ్లకు ఇంటర్య్వూ ఇస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.


ఇక లావణ్య అంతగా ఆరోపణలు చేస్తున్నా రాజ్‌ తరుణ్‌ బయటకు వచ్చి ఏం మాట్లాడటం లేదు. గత కొద్ది రోజులుగా ఆజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో తన లేటెస్ట్‌ మూవీ 'తిరగబడరా సామీ' ప్రమోషన్స్‌లో భాగంగా ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది మూవీ టీం. ఈ మీఇయాలో సమావేశానికి రాజ్‌ తరుణ్‌ కూడా హాజరయ్యాడు. వివాదాల నడుమ చాలా రోజులు తర్వాత రాజ్ తరుణ్‌ మీడియా ముందుకు రావడం ఆసక్తిని సంతరించుకుంది. ఈ సందర్భంగా రాజ్‌ తరుణ్‌ తన మూవీ విషయాల కంటే కూడా వ్యక్తిగత విషయాలపైనే మీడియా ఫోకస్‌ పెట్టింది. ఎక్కువగా లావణ్యతో వివాదంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక లావణ్యకు అబార్షన్ చేయించడంపై విలేఖర్లు ప్రశ్నించగా.. అసలు అందులో నిజం లేదంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. 



 "లావణ్య నాపై చేసిన ఆరోపణల్లో నిజం లేదు. అందుకే ఈ విషయంలో సైలెంట్‌గా ఉంటున్నా. ఆమె చేసే ఆరోపణలపై నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. అందుకే దీనిపై లీగల్‌గానే ముందుకు వెళ్తుతున్నా. ఆమె అన్ని అబద్దాలే చెబుతుంది. అందుకే ప్రతిసారీ మీడియా ముందుకు అబద్దాలను నిజం చేయాలని చూస్తుంది. కానీ, నేను లావణ్యకు వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమెకు అబార్షన్‌ చేయించాను అనడంలో అసలు నిజం లేదు. నా వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆమెను చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ ఆధారాలు అడగలేదు. లావణ్య పెట్టిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలోనూ ఆబార్షన్‌ గురించి లేదు. నిజమైతే అందుకు సంబంధించిన మెడికల్‌ రిపోర్ట్స్ చూపించాలి కదా" అంటూ మాట్లాడుకొచ్చాడు. 


Also Read: ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ఇంట తీవ్ర విషాదం!


అనంతం మాట్లాడుతూ.. తనపై కావాలనే నిందలు వేస్తున్నారంటూ రాజ్ తరున్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్ని కారణాల వల్ల తాను పురుషోత్తముడు మూవీ ప్రమోషన్స్‌కి రాలేకపోయానన్నాడు. ఇక తాను జీవితంలో పెళ్లి గోల పెట్టుకోనన్నాడు. తాను మనిషినేనని, కావాలనే నిందలు వేస్తున్నారన్నారు. దీనివల్ల తాను ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని, నా 32 ఏళ్లలో నా జీవితంలో ఎలాంటి తప్పులు చేయలేదన్నాడు. గత పది రోజులుగా ఇంటికే పరిమితమయ్యానని చెప్పుకొచ్చాడు. లావణ్య వల్ల నేను మాత్రమే కాదు నా తల్లిదండ్రులు కూడా బాధపడుతుననారంటూ రాజ్ తరుణ్‌ వాపోయాడు.