Couple Friendly : నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 14కి మళ్ళీ వస్తాం... 'కపుల్ ఫ్రెండ్లీ' జంటతో కొత్త సినిమా - సక్సెస్ మీట్లో బిగ్ అప్డేట్
Couple Friendly New Movie : 'కపుల్ ఫ్రెండ్లీ' టీం మరో కొత్త ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. సక్సెస్ మీట్లో ప్రముఖ నిర్మాత ధీరజ్ మొగిలినేని రిలీజ్ డేట్ వెల్లడించారు.

Producer Dheeraj Mogilineni New Project With Couple Friendly Team : ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన మూవీస్లో రొమాంటిక్ కామెడీ డ్రామా 'కపుల్ ఫ్రెండ్లీ' బెస్ట్గా నిలిచింది. యంగ్ హీరోయిన్ సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన మూవీకి మంచి టాక్ రావడంతో టీం ఫుల్ జోష్లో ఉంది.
ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాసే ఈ మూవీని 'వర్షం' మూవీతో కంపేర్ చేయడంతో బిగ్ హైప్ క్రియేట్ అవుతోంది. ఇక ఇదే కాంబో మళ్లీ రిపీట్ కానుంది. నెక్స్ట్ ఇయర్ వాలెంటైన్స్ డేకే మళ్లీ 'కపుల్ ఫ్రెండ్లీ' జంటతో కొత్త మూవీ చేయనున్నట్లు సక్సెస్ మీట్లో నిర్మాత ధీరజ్ మొగిలినేని అనౌన్స్ చేశారు.
'కపుల్ ఫ్రెండ్లీ' టీంతో మరో మూవీ
'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ టీంతో మూవీ చేయనున్ననట్లు ధీరజ్ వెల్లడించారు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించబోయే ఈ కొత్త ప్రాజెక్టులో సంతోష్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్లని ప్రకటించారు. యువీ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాణంలో తాను భాగస్వామి కానున్నట్లు చెప్పారు. సరిగ్గా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14నే ఈ మూవీ కూడా రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
Also Read : ఆ ఓటీటీలోకి విశ్వక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
కపుల్ ఫ్రెండ్లీ ఫస్ట్ డే కలెక్షన్స్
'కపుల్ ఫ్రెండ్లీ' మంచి టాక్ సొంతం చేసుకోగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా ప్రీమియర్లతో కలిపి రూ.1.89 కోట్ల కలెక్షన్స్ సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో మూవీ రిలీజ్ చేయగా ఫస్ట్ డే డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇండియాలో మొదటి రోజు రూ.75 లక్షల నెట్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వీకెండ్ ఈ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
మూవీలో సంతోష్ శోభన్, మానస వారణాసిలతో పాటు రాజీవ్ కనకాల, యోగిబాబు, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించగా... యువీ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ధీరజ్ మొగిలినేని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు ఇదే కాంబోలో మళ్లీ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
























