Double Ismart Nizam Release: ఉస్తాద్‌ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. మరో రెండు రోజుల్లో ఈ మూవీ థియేటర్లో విడుదల కానుంది. కానీ ఇప్పటి వరకు ఈ మూవీ నైజాం రిలీజ్‌పై క్లారిటీ లేదు. లైగర్ ఫ్లాప్ వల్ల డబుల్‌ ఇస్మార్ట్‌ విషయంలో డిస్ట్రిబ్యూటర్లు మెలికలు పెడుతూ వస్తున్నారట. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు మధ్య చర్చలు, ఒప్పందాలు జరుగుతూ వచ్చాయి. కానీ ఎవరూ తగ్గకపోవడం ఇది కాస్తా వివాదంగా మారింది.


వారి మధ్య ఒప్పందాలు ఎటూ తేలకపోవడంతో  డబుల్ ఇస్మార్ట్‌ నిజాం రిలీజ్‌పై సస్పెన్స్ నెలకొంది. రిలీజ్‌కు ఇంకా రెండు రోజులే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మూవీ రిలీజ్‌కు కీలకమైన నైజాం ఏరియాలో డబుల్‌ ఇస్మార్ట్‌ను కండిషన్‌పై రిలీజ్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. పూరీ, చార్మీలు తగ్గకపోవడంతో ఇప్పటికి డబుల్‌ ఇస్మార్ట్ నైజం రిలీజ్ ఏటూ తేలకపోవడంతో ఈ చర్చ కాస్తా ఫలిం ఛాంబర్‌ వరకు వెళ్లింది. చాలా సంప్రదింపుల తర్వాత చివరికి ఈ సినిమాను ప్రైం షో ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు రిలీజ్ చేసేందుకు నిర్మాతలు పూరీ, చార్మి ఒప్పుకున్నారట.






దీంతో డబుల్ ఇస్మార్ట్ భారీ ఢీల్‌కు ప్రైం షో దక్కించుకున్నట్టు తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ నైజాంలో రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రైం షో అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. ఎనర్జిటిక్‌ హీరో రామ్ పోతినేని ఊరమాస్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మేజర్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మించారు. 



కాగా ఐదేళ్ల క్రితం పూరీ-రామ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా ఎంతటి బ్లాక్‌బస్టర్ సాధించింది తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న డబుల్‌ ఇస్మార్ట్‌ భారీ అంచాలు నెలకొన్నాయి. చాక్లేట్‌ బాయ్ అయిన రామ్‌ను ఊరమాస్‌గా చూపించాడు. అప్పట్లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించించింది. సాంగ్స్‌ కూడా బ్లాక్‌బస్టర్‌ అయ్యాయి. ఇప్పుడు ఇదే సినిమాను డబుల్‌ ఇస్మార్ట్‌ పేరుతో థియేటర్లోకి తీసుకువస్తున్నాడు పూరీ. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 


Also Read: మిస్టర్ బచ్చన్ వర్సెస్ డబుల్ ఇస్మార్ట్... రవితేజ కంటే రామ్ సినిమాకు ఎక్కువ బిజినెస్?


మొదట డబుల్ ఇస్మార్ట్ నైజాం థియేట్రికల్ రైట్స్‌ను హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి కొనుగోలు చేసి, డిస్ట్రిబ్యూషన్ కోసం మైత్రీ దగ్గర ఉంచినట్టు సమాచారం. అయితే ఈ చిత్రంపై జరుగుతున్న రచ్చ చూసి మైత్రీ మూవీ మేకర్స్ వెనక్కి తగ్గినట్టు టాక్‌. ఈ నేపథ్‌యంలో నేడు ఫిలిం ఛాంబర్‌లో సినీపెద్దల సమక్షంలో జరిగిన సమావేశంలో చివరకి ప్రైం షో ఎంటర్‌టైన్‌మెంట్‌ వారు డబుల్ ఇస్మార్ట్‌ నైఙాం ఏరియా రైట్స్‌ని భారీ ఢీల్‌కు దక్కించుకున్నారు.