Niharika Konidela about Divorce: గత రెండు, మూడేళ్లలో టాలీవుడ్‌ జంటల మధ్య జరిగిన విడాకులు సెన్సేషన్‌గా మారాయి. అందులో మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల విడాకులు కూడా ఒకటి. చైతన్య జొన్నలగడ్డను ప్రేమించి పెళ్లి చేసుకుంది నిహారిక. వీరిద్దరి డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చాలా ఘనంగా జరిగింది. కానీ పెళ్లయిన ఏడాదిలోనే వీరిద్దరూ విడిపోయారంటూ వార్తలు వచ్చాయి. వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్ వేడుకల్లో కూడా చైతన్య ఎక్కడా కనిపించకపోవడంతో రూమర్స్ మరింత పెరిగాయి. ఫైనల్‌గా విడాకుల గురించి వీరిద్దరూ సోషల్ మీడియాలో అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఇక ఇన్నాళ్ల తర్వాత తన విడాకుల విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది నిహారిక.


ఎవరినీ ఈజీగా నమ్మకూడదు..


తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది నిహారిక కొణిదెల. అందులో తన పెళ్లి బంధం ఏడాదిలోనే ముగిసిపోతుందని అనుకోలేదంటూ తన పెళ్లి, విడాకుల గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. పెళ్లి మిగిల్చిన బాధ వల్ల ఎవరినీ ఈజీగా నమ్మకూడదని తెలుసుకున్నానని చెప్పింది. విడాకులతోనే జీవితం ముగిసిపోయినట్టు కాదని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఎదుటివారిని ఈజీగా నమ్మకూడదన్న విషయం పెళ్లి తర్వాతే తెలుసుకున్నానని, దానిని ఒక పాఠంగా భావించి ముందుకు సాగడం అలవాటు చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ అవన్నీ గుర్తొస్తే తనకు కన్నీళ్లు వస్తాయని ఎమోషనల్‌గా మాట్లాడింది. 


ట్రోల్స్‌పై నిహారిక స్పందన..


ఇక పెళ్లయిన ఏడాదిలోనే విడాకులు తీసుకోవడంపై నిహారికపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. అలాంటప్పుడు అంత ఖర్చు పెట్టి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడం ఎందుకు అంటూ చాలామంది విమర్శించారు. వాటిపై కూడా తను స్పందించింది. పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయమని చెప్పుకొచ్చింది. ఎప్పటికీ కలిసి ఉంటామనే ఉద్దేశ్యంతోనే ఏ జంట అయినా పెళ్లి చేసుకుంటారని, అంతే కానీ సంవత్సరంలోనే విడిపోతామని అనుకొని భారీగా ఖ‌ర్చుపెట్టి ఎవ‌రూ పెళ్లిచేసుకోర‌ని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఏ జంట అయినా ఏ అడ్డంకులు లేకుండా త‌మ రిలేష‌న్‌షిప్ సాఫీగా సాగాల‌నే కోరుకుంటారని తెలిపింది. అలా ఆలోచించే ప్రేమ, పెళ్లి అనేవాటిలో అడుగుపెడతారని.. తాను కూడా అలాగే అనుకున్నానని చెప్పింది.


అందుకే బంధాన్ని ముగించేశాను..


తాను ఊహించినట్టు ఏదీ జరగలేదని నిహారిక చెప్పుకొచ్చింది. అందుకే ఆ బంధాన్ని ముగించేశానని తెలిపింది. తన కుటుంబ సభ్యులు, తన స్నేహితులు తన గురించి ఏమనుకుంటారో అది మాత్రమే తనకు ముఖ్యమని, తనకు తెలియని వారు, సంబంధం లేనివారు ఏమనుకున్నా తాను పట్టించుకోనని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక గత రెండేళ్లలో ఫ్యామిలీ విలువను బాగా అర్థం చేసుకున్నానని బయటపెట్టింది నిహారిక. తనను ఒక భారంగా తన కుటుంబ సభ్యులు ఎప్పుడూ భావించలేదని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇక విడాకుల తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటోంది ఈ మెగా ప్రిన్సెస్. ప్రస్తుతం తెలుగు, తమిళంలో రెండు సినిమాలు తన చేతిలో ఉన్నాయని రివీల్ చేసింది. ఇప్పటికే ‘డెడ్ పిక్సెల్స్’ అనే వెబ్ సిరీస్‌తో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. నటిగా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా బిజీ అయ్యింది నిహారిక.


Also Read: చిరంజీవికి ముందు పద్మ విభూషణ్ అందుకున్న హీరోలు ఎవరో తెలుసా?