Chiranjeevi Favourite Hero In Present Generation : ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఓ లెజెండ్. అప్పటి జనరేషన్ నుంచి ఇప్పటి యంగ్ హీరోస్ వరకూ ఎంతో మందికి ఆయనే ఓ ఇన్స్పిరేషన్. చిరు నోటి నుంచి తమ పేరు రావడమే ఓ గొప్ప అదృష్టంగా భావిస్తుంటారు ఇప్పటి హీరోస్. అలాంటిది ప్రస్తుత జనరేషన్లో ఆయనకు నచ్చిన హీరో ఎవరో తాజాగా రివీల్ అయ్యింది.
చిరు నచ్చిన మెచ్చిన హీరో!
ఇప్పటి జనరేషన్లో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అంటే మెగాస్టార్కు చాలా ఇష్టమట. ఈ విషయాన్ని డైరెక్టర్ బాబీ 'అనగనగా ఒక రాజు' సక్సెస్ సెలబ్రేషన్స్లో రివీల్ చేశారు. 'టైమ్ బాగుంటే హీరో అవుతారని కొందరు అంటుంటారు. కానీ టైమింగ్ బాగుండి హీరో అయిన వ్యక్తి నవీన్ పోలిశెట్టి. ప్రమాదం జరిగి బెడ్పై ఉన్నా తనే స్వయంగా స్టోరీ రాసుకుని ఈ మూవీపై వర్క్ చేశాడు. అలా ఓ మంచి టీమ్ను ఆర్గనైజ్ చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
మూవీ రిలీజ్ తర్వాత నేను నా తర్వాత మూవీ కోసం చిరంజీవి గారిని కలిశాను. నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' మూవీ చాలా బాగుందట కదా బాబీ అంటూ ఆయన నన్ను అడిగారు. ఇప్పుడొస్తున్న జనరేషన్స్లో నాకు బాగా నచ్చిన హీరో నవీన్ అని చిరు అన్నారు. నవీన్ ఎంతో ఎనర్జీతో చేస్తారని అన్నారు. 'మన శంకర వరప్రసాద్ గారు' సక్సెస్తో పాటు నవీన్ మూవీ సక్సెస్ను కూడా ఎంజాయ్ చేశారు.' అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read : 'జన నాయగన్' మూవీ రిలీజ్ - అదే బాధగా ఉంది... దళపతి విజయ్ రియాక్షన్
'అదే నా బాధ్యత'
ఈ సంక్రాంతికి పోటీ ఉన్నా 'అనగనగా ఒక రాజు' బిగ్ సక్సెస్ అందుకుందని అన్నారు హీరో నవీన్ పోలిశెట్టి. 'ఇదంతా ప్రేక్షకుల ఆశీర్వాదమే. నేను ఏ సినిమా చేసినా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు, ప్రేక్షకుల గురించి ఆలోచిస్తా. ఏడాదికి రెండు మూడూ సినిమాలు చేయడం గొప్ప విషయం కాదు. అవి అందరికీ కనెక్ట్ చేయడమే నా బాధ్యత. ముంబయిలో ఆడిషన్స్ టైంలో ఇండస్ట్రీ వదిలేయాలనుకున్నా. ఎంతోమంది నన్ను నిరుత్సాహపరిచారు. కట్ చేస్తే తెలుగు ఆడియన్స్ నాకు వరుసగా నాలుగు విజయాలు అందించారు.' అంటూ చెప్పారు.
ఈ సంక్రాంతికి మెగాస్టార్ 'మన శంకర వరప్రసాద్ గారు' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వరల్డ్ వైడ్గా రూ.350 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ మూవీతో పాటే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కామెడీ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక రాజు' కూడా మంచి విజయం సాధించింది. సినిమాకు మారి దర్శకత్వం వహించగా... నవీన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
