Mahesh Babu's Varanasi Shooting Update : ఒకే ఒక్క మూవీ... టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ యావత్ సినీ ప్రపంచాన్నే తన వైపు చూసేలా చేసింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబో విజువల్ వండర్ 'వారణాసి' షూటింగ్ ఆధ్యాత్మిక నగరానికి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది.

Continues below advertisement

ఒడిశా, కెన్యాలతో పాటు ఇతర దేశాల్లో ఇప్పటికే పలు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న 'వారణాసి' టీం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలోనూ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... భారీ యాక్షన్ సీక్వెన్స్‌‌ తీసేందుకు వేరే చోటుకి ప్లాన్ చేసినట్లు సమాచారం.

వాటర్ క్రైసిస్...

Continues below advertisement

'వారణాసి'లో కీలకమైన అండర్ వాటర్ సీక్వెన్స్ సీన్ కోసం గగన్ పహాడ్ పరిసరాల్లో భారీ కొలను నిర్మించారు. ఇందుకోసం ఏకంగా 150 ట్యాంకర్ల నీళ్లు అవసరం పడగా టీం జలమండలికి లేఖ రాసింది. అయితే, వేసవి కావడంతో నీటి ఎద్దడి దృష్ట్యా అంత నీళ్లు ఇవ్వలేమని అధికారులు తెలిపారు. దీంతో ప్రత్యామ్నాయం కోసం టీం వేట మొదలుపెట్టింది. ఇప్పటికే నిర్మించిన సెట్‌ను తీసేయాల్సి వచ్చిందని ఇన్ సైడ్ వర్గాల టాక్.

Also Read : iBOMMA మళ్లీ వచ్చిందా - కొత్త పేరుతో పైరసీ వెబ్ సైట్?

వారణాసి లేదా...

ఈ భారీ యాక్షన్ సీన్ కోసం యూపీలోని వారణాసి లేదా ప్రయాగ్ రాజ్ ప్రాంతాలను టీం పరిశీలిస్తోందని సమాచారం. అక్కడ నీటి ఎద్డడి అంతగా లేనందున ఎలాంటి ఇబ్బంది ఉండదని టీం భావిస్తోందట. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. హైదరాబాద్‌లో ఇప్పటికే మహేశ్, ప్రియాంకలపై కీలక సీన్స్ షూట్ చేశారు. విలన్ రణ కుంభ రోల్‌కు సంబంధించి షూటింగ్ పార్ట్ ఎప్పుడో పూర్తైంది. వీలైనంత త్వరగా మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేసి పూర్తిగా VFXపై ఫోకస్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. 

Also Read : సూర్యకు ఎదురుదెబ్బ... చిక్కుల్లో 'కరుప్పు' - మార్నింగ్ & ఓవర్సీస్ షోస్ క్యాన్సిల్

స్టోరీ ఏంటంటే?

గ్లోబ్ ట్రాటర్... ప్రపంచాన్ని చుట్టే ఓ సాహస అన్వేషకుడి కథే వారణాసి. ఓ శక్తి కోసం బయలుదేరిన సాహసికుడు దాన్ని సాధించిన తర్వాత విలన్ కుట్రను తెలుసుకుని దాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే స్టోరీ లైన్ అని తెలుస్తోంది. ఈ కథ వారణాసి నగరంలోనే ప్రారంభమై అదే నగరంలో ముగుస్తుందని రీసెంట్ మెక్సికోలోని కామిక్ కాన్ ఎక్స్‌పీరియన్స్ ఈవెంట్‌లో చెప్పారు రాజమౌళి కుమారుడు, సహ నిర్మాత కార్తికేయ. దాదాపు 20 నిమిషాల పాటు సాగే రామాయణం ఎపిసోడ్ అద్భుతమని అన్నారు. వారణాసి రియల్ లుక్ వచ్చేలా సెట్స్ తీర్చిదిద్దామని... దీని కోసం ఎంతో పరిశీలన చేసినట్లు చెప్పారు. 

ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా... త్వరలోనే మ్యూజిక్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మహేశ్‌తో పాటు ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో 2027 ఏప్రిల్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : పావలా కోసం కొట్టుకుంటున్నాం - పర్సంటేజీ ఇష్యూపై బన్నీ వాస్ టాప్ రీజన్స్

Note : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.