Varanasi Update : మహేశ్ 'వారణాసి' షూటింగ్ అప్డేట్ - మంచు కొండల్లో బిగ్ ఫైట్
Varanasi Movie : మహేశ్ బాబు 'వారణాసి' మూవీ షూటింగ్ ప్రస్తుతం అంటార్కిటికాలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ఇది మూవీకే హైలెట్ అని సమాచారం.

Mahesh Babu's Varanasi New Schedule : యావత్ సినీ ప్రపంచం ఈగర్గా వెయిట్ చేస్తున్న విజువల్ వండర్ 'వారణాసి'. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతోన్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్తోనే హాలీవుడ్ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది.
అంటార్కిటికా షెడ్యూల్
రీసెంట్గా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన హింట్తో 'వారణాసి' నెక్స్ట్ షెడ్యూల్ అంటార్కిటికాలో జరుగుతున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. 'ది బ్లఫ్' మూవీపై ప్రశంసలు కురిపిస్తూ మహేశ్ బాబు ట్వీట్ చేయగా... ప్రియాంక ఆయనకు థాంక్స్ చెబుతూ... 'త్వరలో అంటార్కిటికాలో కలుద్దాం' అంటూ రిప్లై ఇచ్చారు. జార్జీయా షెడ్యూల్ తర్వాత అంటార్కిటికాలో కీలక సీన్స్ షూట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
స్పెషల్ అట్రాక్షన్
సినిమాలో భారీ యాక్షన్ సీన్ మంచు కొండల్లో షూట్ చేశారట. ఈ ఫైట్ మూవీకే స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుందని చెబుతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ అంటార్కిటికా మంచు కొండలను చూపించి హైప్ క్రియేట్ చేశారు. సృష్టి ఆవిర్భావం నుంచి వారణాసి నగరం పుట్టుక, రామాయణంలో ఓ ముఖ్య ఘట్టంతో పాటు ప్రపంచ యాత్ర చేసే ఓ సాహసికుడు కథగా 'వారణాసి'ని తెరకెక్కిస్తున్నారు. అన్నీ కాలాలు, యుగాలను కలిపి విజువల్ వండర్ను సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.
షూటింగ్ అప్డేట్ ఏంటంటే?
ఇప్పటికే 14 నెలల షూటింగ్ పూర్తైనట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రియాంక చోప్రా. మరో 6 నెలల షూటింగ్ చేస్తే మూవీ కంప్లీట్ అవుతుందని అన్నారు. రామాయణం కీలక ఘట్టం సహా ఇతర సీన్స్ చిత్రీకరణ పూర్తైనట్లు తెలుస్తుండగా... మిగిలిన సీన్స్ కూడా త్వరగా పూర్తి చేసి VFX, ఇతర పనులపై ఫోకస్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట.
ఓవర్సీస్ రైట్స్... బిగ్ ఆఫర్
ఓ వైపు మూవీ షూటింగ్ జరుగుతుండగానే... మరోవైపు బిజినెస్ కూడా అంతే వేగంగానే జరుగుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఓటీటీ డీల్ కోసం బిగ్ కాంపిటీషన్ నెలకొనగా... ఓవర్సీస్ హక్కుల కోసం దాదాపు రూ.160 కోట్ల భారీ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అన్నీ ఇండియన్ భాషలకు కలిపి ఈ రేంజ్ ధర పలకడం ఓ రికార్డ్.
'వారణాసి' కోసం ఏడాది ముందు నుంచే మహేశ్, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అవి పూర్తిగా మొదలు కాక ముందే ఈ స్థాయిలో బిజినెస్ జరగడం విశేషం. ఇక రాబోయే రోజుల్లో థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్ హక్కుల కోసం మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : ధురంధర్ 2 ట్రైలర్ రివ్యూ - వయలెన్స్తో పాటు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ వేరే లెవల్
మూవీలో రుద్రుడిగా మహేశ్, మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, విలన్ రణ కుంభగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, శివ భక్తుడిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా... దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ దాదాపు రూ.1300 కోట్ల బడ్జెట్తో మూవీని నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో 2027 ఏప్రిల్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రెండింగ్ వార్తలు























