Ram Charan : రామ్ చరణ్ దేవాలయం - అర్జున్ థియేటర్ వద్ద చరణ్ విగ్రహంపై ట్రోలింగ్స్... సారీ చెప్పిన ఫ్యాన్స్
Peddi Celebrations : తెలుగు రాష్ట్రాల్లో పెద్ది సంబరాలు షురూ అయ్యాయి. కూకట్పల్లి అర్జున్ థియేటర్ వద్ద రామ్ చరణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా దానిపై ట్రోలింగ్ సాగుతోంది.

Ram Charan Idol Mega Fans Trolled By Netizens : దేశవ్యాప్తంగా పెద్ది మేనియా నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో మెగా ఫ్యాన్స్ సంబరాలు షురూ అయ్యాయి. హైదరాబాద్, విజయవాడ, ఏలూరు నగరాల్లో థియేటర్ల వద్ద రామ్ చరణ్ భారీ కటౌట్స్తో సందడి చేస్తున్నారు. కూకట్పల్లిలో చరణ్ ఫ్యాన్స్ మరో అడుగు ముందుకేసి ఏకంగా ఆలయలా సెట్ వేసి చరణ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
విగ్రహంపై ట్రోలింగ్స్
కూకట్పల్లిలోని అర్జున్ థియేటర్ వద్ద మాస్సివ్ సెలబ్రేషన్స్కు రెడీ అవుతూ కొణిదెల వారి ఆలయం, రామ్ చరణ్ దేవాలయం ఏర్పాట్లు చేశారు మెగా ఫ్యాన్స్. తమ అభిమాన హీరోపై అభిమానాన్ని చాటుకుంటా భారీ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశారు. పెద్దిలో చరణ్ రగ్గడ్ లుక్కు అనుగుణంగా విగ్రహాన్ని రెడీ చేయగా... దానికి చరణ్తో అస్సలు పోలికలు లేకపోవడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగుతోంది. దీనిపై మీమ్స్ కూడా పేలుతున్నాయి.
ఇది రాహుల్ రామకృష్ణలా ఉందని... కాదు మలయాళ యాక్టర్ జోజు జార్జ్ విగ్రహంలా ఉందంటూ సెటైర్స్ వేస్తున్నారు. వేరే ఫోటోస్తో కంపేర్ చేస్తూ... ట్రోల్ చేస్తున్నారు.
Arjun theater is getting ready for a Massive celebrations 💥❤️🔥@AlwaysRamCharan #Peddi #PeddiMassCarnival #Arjun70MM pic.twitter.com/JUqhi32WHq
— kukatpally70mm (@kukatpally70mm) June 1, 2026
#Ramcharan vigraham at Arjun theatre, Kukatpally, Hyderabad.#PeddiTakeOver #Peddi pic.twitter.com/aLL8FAgb2I
— ADAV_MEMEPAGE (@AdavMemepage) June 2, 2026
సారీ చెప్పిన ఫ్యాన్స్
కూకట్పల్లి రామ్ చరణ్ ఫ్యాన్స్ క్లబ్ దీనిపై క్షమాపణలు చెప్పారు. చరణ్ గారిపై తమకున్న అభిమానం, ఇష్టాన్ని స్పెషల్గా చూపించాలనే విగ్రహాన్ని పెట్టామని... దురదృష్టవశాత్తు ఎగ్జిక్యూషన్ అనుకున్నట్లుగా రాలేదని తెలిపారు. ఇది మిస్ ఫైర్ అయ్యిందని... ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని... తమ ప్రయత్నం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలని అన్నారు.
ఈ విగ్రహాన్ని 'ఆర్సీ యువశక్తి' ప్రెసిడెంట్ ప్రముఖ నిర్మాత పసుపులేటి శివ ఆవిష్కరించారు. ఆయన ఫ్యాన్స్ను సపోర్ట్ చేస్తూ... సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్పై రియాక్ట్ అయ్యారు. 'ఫ్యాన్స్ చేసే ప్రతీ పని వెనుక నిజమైన ప్రేమ, అభిమానం, వారి కష్టం ఉంది. ఈ ఈవెంట్ను కూకట్పల్లి లోకల్ ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. దూరం నుంచి కామెంట్ చేయడం చాలా ఈజీ. ఈ విగ్రహంపై నెగిటివ్ కామెంట్స్ చూశాను. ఫ్యాన్స్ ఎమోషన్, డెడికేషన్ మనం అర్థం చేసుకోవాలి.' అంటూ రాసుకొచ్చారు.
Also Read : Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
మరోవైపు, పెద్ది ప్రీ సేల్స్ రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. ఓవర్సీస్లో వన్ మిలియన్ గ్రాస్ మార్క్ టచ్ చేసింది. ఓవర్సీస్ టోటల్ కలెక్షన్స్ రూ.35 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.11 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఏపీలో రూ.7.19 కోట్లు, తెలంగాణలో రూ.1.78 కోట్లు కలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు























