Ravi Mohan Vs Kushboo: 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?
Kushboo Tweet On Ravi Mohan: 'జయం' రవి విడాకుల వ్యవహారంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఆయన ప్రెస్ మీట్ తర్వాత ఖుష్బూ పరోక్షంగా ట్వీట్ చేశారు. దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉందని అర్థం అవుతోంది.

తమిళ కథానాయకుడు 'జయం' రవి అలియాస్ రవి మోహన్ వ్యక్తిగత జీవితం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. భార్య ఆర్తి నుంచి ఆయన విడాకులు కోరుతున్నారు. ఆర్తి ఏమో ఇవ్వడం లేదు. వీళ్లిద్దరి కాపురంలో కలహాలకు కారణం ఏమిటి? అనేది పూర్తిగా ఎవరూ చెప్పలేదు. అయితే... ఆర్తితో సంసార జీవితంలో తాను సంతోషంగా లేనని, తనను వేధించారని రవి మోహన్ పేర్కొన్నారు.
ఆర్తితో రవి మోహన్ కాపురంలో చిచ్చు పెట్టింది ఎవరు? అంటే... నటి, సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ (Kushboo Sundar)యేనా? అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం రవి మోహన్ ప్రెస్ మీట్ తర్వాత ఖుష్బూ చేసిన ట్వీట్. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏమైంది? తాజా వివాదం ఏమిటి? అనేది చూస్తే...
ఇడ్లీ నటి... సంసారాలు నాశనం చేసింది
'జయం' రవిని వదిలి వెళుతున్నట్టు శుక్రవారం (మే 15న) సింగర్ కెనీషా పోస్ట్ చేశారు. అందులో 'ఇక నుంచి అతను మీవాడు' అని పేర్కొన్నారు. దాంతో రవి మోహన్ - కెనీషా మధ్య బ్రేకప్ అయ్యిందని తమిళ ప్రజలు భావిస్తున్నారు. ఈ రోజు (శనివారం, మే 16న) రవి మోహన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో ఓ నటి మీద విమర్శలు చేశారు.
విలేకరుల సమావేశంలో రవి మోహన్ ఎవరి పేరును నేరుగా ప్రస్తావించలేదు. కానీ, 'ఇడ్లీ నటి' (Idly Nadigai) అని పేర్కొన్నారు. అది ఖుష్బూను ఉద్దేశించి చేసిన కామెంట్ అని కోలీవుడ్ టాక్. రవి మోహన్ మాట్లాడుతూ... ''నేను ఆమె పేరును కూడా చెప్పాలని అనుకోవడం లేదు. ఆమె మూడు పదాల నటి. ఫెమినిజం ముసుగులో మా వైవాహిక జీవితంలో జోక్యం చేసుకుంది. ఆమె వల్ల నా సంసారమే కాదు... మరో ముగ్గురు సీనియర్ నటుల సంసారాలు కూడా నాశనం అయ్యాయి. నా వ్యక్తిగత విషయాలపై మాట్లాడే నైతిక హక్కు ఆ నటికి లేదు'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Peddi Trailer Review - 'పెద్ది' ట్రైలర్పై చిరంజీవి రివ్యూ... మెగా ట్వీటులో రామ్ చరణ్ డైలాగ్ లీక్
View this post on Instagram
కొంత మంది ఎంతకైనా తెగిస్తారు!
రవి మోహన్ ప్రెస్ మీట్ ముగిసిన కాసేపటికి ఖుష్బూ సుందర్ ఎక్స్ (ట్విట్టర్)లో ఒక ట్వీట్ చేశారు. రవి మోహన్ పేరును ఆమె కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, "కొంత మంది తమ డిఎన్ఏను నిరూపించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. నన్ను కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు థాంక్స్'' అని పేర్కొన్నారు.
ఆర్తిపై రవి మోహన్ పలు ఆరోపణలు చేశారు. పెళ్లి టైంలో తనను బ్లాక్ మెయిల్ చేసిందని, తనపై చేతబడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తన ప్రాణాలు పోవాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారని, తనను ఆర్థికంగా కట్టడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రవి మోహన్ ప్రెస్ మీట్ ఫుల్ స్పీచ్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Some are just hell bent to prove their DNA. Thank you for proving me right. 🙏😊
— KhushbuSundar (@khushsundar) May 16, 2026
ఆర్తి రవి (Ravi Mohan Wife Aarti)కి ఖుష్బూ సన్నిహితురాలని కోలీవుడ్ టాక్. రవి మోహన్ ప్రెస్ మీట్ తర్వాత 'నిద్రపోతున్న సింహాన్ని లేపవద్దు' అంటూ ఆర్తి ఓ కౌంటర్ ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్ట్ కింద ''అమ్మ (తల్లి)తో ఎప్పుడూ పరాచకాలు వద్దు. నువ్వు పిల్లలతో ఉన్న సివంగి (ఆడ సింహం). నీకు మరింత శక్తి కలగాలి'' అని కామెంట్ చేశారు. దాంతో 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టినది ఖుష్బూయేనా? ప్రెస్ మీట్ తర్వాత ఆవిడ భుజాలు తడుముకోవడం ఎందుకు? అని సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది.
Photo Gallery: Anasuya Bikini Photos - బికినిలో అనసూయ... ప్రేక్షకులకు బర్త్ డే ట్రీట్
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















