Devara Second Single: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ల రొమాంటిక్‌ సాంగ్ వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌,బాలీవుడ్‌ జాన్వీ కపూర్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పాన్‌ మూవీ 'దేవర'.  సెప్టెంబర్‌ 27న ఈ సినిమా రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో దేవర నుంచి ఒక్కొక్కొ అప్‌డేట్‌ వదులుతూ మూవీపై క్యూరియాసిటీ పెంచుతుంది మూవీ టీం. ఇప్పటికే విడుదలైన  దేవర ఫియర్‌ సాంగ్‌కు విశేష స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఆగష్టు 5) దేవర సెకండ్‌ సింగిల్‌ను రిలీజ్‌ చేసింది మూవీ టీం. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ రిలీజ్‌ చేయగా దానికి మంచి స్పందన వచ్చింది. పోస్టర్‌లో జాన్వీ కపూర్‌, ఎన్టీఆర్‌ల కెమిస్ట్రీ బాగుందంటూ ఆడియన్స్‌ నుంచి రివ్యూస్‌ వచ్చాయి.






దీంతో ఈ రొమాంటిక్‌ సాంగ్‌ వారి ఫుల్‌ కెమిస్ట్రీ చూసేందుకు ఫ్యాన్స్‌ అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చుట్టుమల్లే సూట్టెస్తాందే తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు అంటూ మెలోడియస్‌ సాగింది ఈ పాట. ప్రస్తుతం ఈపాట సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంది. ఇక ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌లపై తెరకెక్కించిన ఈ రొమాంటిక్‌ సాంగ్‌లో వీరిద్దరి స్టిల్స్‌ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక పాటలో జాన్వీ అందాలకు కుర్రకారు ఫిదా అవుతుంది. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రీ రాసిన ఈ పాటను శిల్పా రావ్‌ ఆలిపించగా.. అనిరుద్‌ రవిచందర్‌ స్వరాలు సమకుర్చాడు. కాగా ఈ సినిమాకు బ్యాగ్రౌండ్‌ స్కోర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కూడా ఆయన వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 



 


అంతేకాదు ఎన్టీఆర్‌,జాన్వీల పెయిర్‌ చాలా క్యూట్‌గా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అప్పుడు సీనియర్‌ ఎన్టీఆర్‌-శ్రీదేవి; ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌-జూనియర్ శ్రీదేవి అని పోల్చుతూ ఫ్యాన్స్ పోల్చుకుంటున్నారు. అంతేకాదు సీనియర్‌ ఎన్టీఆర్‌-శ్రీదేవిల ఆకుచాటు పింద తడితే రొమాంటిక్‌ పాటను, దేవర సెకండ్‌ సింగిల్‌ కలిపి చూస్తు ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. కాగా దేవరను ముందుగా ఈ ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేస్తామన్నారు. తారక్‌ ఆస్కార్‌ అవార్డు వేడులతో బిజీ అవ్వడం వల్ల ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అయ్యింది. దీపావళి సందర్భంగా ఆక్టోబర్ 10న రిలీజ్‌ చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటన ఇచ్చింది.



కానీ, ఏం జరిగిందో ఏమో కానీ, ఈ సినిమాను రెండు వారాలు ముందుకు తీసుకువచ్చి సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారు. ఫైనల్ ఈ మూవీ రిలీజ్‌ కాస్తా రెండు వారాలు ముందుకు రావడంతో ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. కాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై రూపొందిస్తున్నారు. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతికథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఫైనల్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్‌ని జరుపుకోని విడుదలకు రెడీ కానుంది.



Also Read: 'తంగలాన్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో యాంకర్‌ సుమకు షాక్‌ - స్టేజ్‌పైనే కిస్‌ ఇచ్చిన నటుడు, అవాక్కైన యాంకర్