Prabhas taking lesser remuneration for Rajasabh Movie?:  పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ 'క‌ల్కీ 2898 ఏడి' సినిమా సూప‌ర్ స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆ త‌ర్వాత కూడా ఆయ‌న వరుస ప్రాజెక్ట్ ల‌తో బిజీ బిజీగా ఉన్నారు. మారుతి డైరెక్ష‌న్ లో 'రాజాసాబ్' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు ప్ర‌భాస్. అయితే ఆ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. అదే ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్ కి సంబంధించి. 


రెమ్యున‌రేష‌న్ త‌క్కువ తీసుకుంటున్నార‌ట‌?


ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకున్నారా? ఆయ‌న 'రాజాసాబ్'కి  రెమ్యున‌రేష‌న్ త‌క్కువ తీసుకుంటున్నారా? అంటే అవున‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. 'క‌ల్కీ 2898 ఏడీ' సినిమాకి తీసుకున్న రెమ్యున‌రేష‌న్ కంటే ఈ సినిమాకి త‌క్కువ‌గా తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. అంతేకాదు రెమ్యున‌రేష‌న్ ఎంత‌ డిమాండ్ చేశారు? ఎంత త‌గ్గించుకున్నారు అనే విష‌యం కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్ర‌భాస్ న‌టించిన ‘ఆదిపురుష్’ సినిమాని నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ సినిమాని కూడా నిర్మిస్తోంది.


2025లో రిలీజ్.. 


ఇక 'రాజాసాబ్' సినిమాని 2025లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. దానికి సంబంధించి షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కామెడీ జోన‌ర్ లో తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ప్ర‌భాస్ స‌ర‌స‌న మాల‌విక మోహ‌న‌, నిధి అగ‌ర్వాల్ ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ప్ర‌భాస్ లుక్ రిలీజ్ అయ్యింది. ప్ర‌భాస్ లుంగీ క‌ట్టుకుని న‌డుస్తున్న ఫ‌స్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్ మాస్, కామెడీ సినిమా అని కామెంట్లు పెడుతున్నారు.  


'క‌ల్కీ 2898 ఏడీ'తో.. 


'బాహుబ‌లి', 'బాహుబ‌లి - 2' సినిమాల‌తో పాన్ ఇండియా స్టార్ గా మారారు ప్ర‌భాస్. ఆయ‌న క్రేజ్ విప‌రీతంగా పెరిగింది. కానీ, ఆ త‌ర్వాత వ‌చ్చిన సినిమాలు నిరాశ‌నే మిగిల్చాయి. 2023లో వ‌చ్చిన ‘స‌లార్’ సినిమా హిట్ తో ఖుషీలో ఉన్నారు ఆయ‌న ఫ్యాన్స్. ఇక ఇప్పుడు 'క‌ల్కీ 2898 ఏడీ' సినిమా భారీ విజ‌యం సాధించ‌డంతో పండ‌గ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'క‌ల్కీ 2898 ఏడీ' సినిమా భారీ రికార్డులు న‌మోదు చేసింది. క‌లెక్ష‌న్ల‌లో దూసుకుపోయిన విష‌యం తెలిసిందే. ఇక ఆ సినిమాలో ప్ర‌భాస్, దిపికా ప‌దుకొణే, అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. 


ఇక ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేతిలో వ‌రుస ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. 'రాజాసాబ్', 'యానిమ‌ల్' ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వంలో 'స్పిరిట్' చేస్తున్నారు. కాగా.. 'క‌ల్కీ 2898 ఏడీ' సినిమాకి పార్ట్ - 2 కూడా ఉంది. త్వరలోనే ఆ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే - పొట్టి డ్రెస్‌లో అందాల ఆరబోతపై అమలా పాల్ కామెంట్స్