Disha Patani Father After  Encounter: సెప్టెంబర్ 17 బుధవారం  బరేలీలో తమ ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు నటి దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీ. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. 

Continues below advertisement

"నా తరపున, నా కుటుంబ సభ్యుల తరపున నేను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన నాకు హామీ ఇచ్చిన విధంగానే నేరస్థులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకున్నారు. నేను ఈరోజు సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడాను ..ఆయన మార్గదర్శకత్వంలో యూపీ ప్రభుత్వం  యూపీ పోలీసులు భయరహిత సమాజాన్ని పూర్తిగా సాకారం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని రిటైర్డ్ DSP అయిన జగదీష్ పటానీ ఒక వీడియో సందేశంలో తెలిపారు. 

Continues below advertisement

ఎన్‌కౌంటర్‌లో కాల్పులు జరిపిన వ్యక్తి మృతి

బరేలీలోని పటానీ పూర్వీకుల నివాసంపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు బుధవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో  ఘజియాబాద్‌లో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించారని అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, హర్యానా ఎస్‌టీఎఫ్ మరియు యూపీ ఎస్‌టీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఢిల్లీకి చెందిన ఒక పోలీసు సిబ్బంది గాయపడ్డారు.

సెప్టెంబర్ 12న తెల్లవారుజామున కాల్పుల ఘటన జరిగింది. బరేలీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న పటానీ కుటుంబ ఇంటిపై కాల్పులు జరిగాయి, అక్కడ ఆమె తండ్రి, తల్లి ,పెద్ద సోదరి ఖుష్బూ పటానీ ఉన్నారు. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఈ దాడికి తానే బాధ్యత వహిస్తున్నానని, పటానీ ఆమె సోదరి ఇద్దరు మత పెద్దలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ దాడి జరిగిందని ఆరోపించారు. 

భరోసా ఇచ్చిన యోగి ఆదిత్యనాథ్

సెప్టెంబర్ 14న ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే, యోగి ఆదిత్యనాథ్ నేరుగా జగదీష్ పటానీతో ఫోన్‌లో మాట్లాడారు. వారు కుటుంబానికి సానుభూతి తెలిపి, " రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది.. మీ కుటుంబ భద్రతలో ఎటువంటి నిర్లక్ష్యం జరగదు" అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా, పటానీ ఇంటి చుట్టూ భద్రతను పెంచారు, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశోధించారు. సెప్టెంబర్ 17న ఘాజియాబాద్‌లో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) మరియు ఢిల్లీ పోలీసులు ఈ దాడికి సంబంధించిన ఇద్దరు నిందితులను (రోహిత్ గోదారా-గోల్డీ బ్రార్ గ్యాంగ్ సభ్యులు) ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. 

ఘటన వివరాలు టైమ్ లైన్ ఇదే

సెప్టెంబర్ 12, 2025 -  బరెల్లీలో పటానీ ఇంటి ముందు షూటింగ్ (3:30 AM)..FIR దాఖలు చేసిన జగదీష్ సెప్టెంబర్ 14, 2025 -  యోగి ఫోన్ కాల్ చేసి భద్రతపై హామీ. పటానీ ఇంటి చుట్టూ పెరిగిన భద్రత  సెప్టెంబర్ 17, 2025 - ఘాజియాబాద్‌లో ఎన్‌కౌంటర్..ఇద్దరు నిందితులు హతం

సెప్టెంబర్ 18, 2025 - జగదీష్ పటానీ వీడియో ద్వారా యోగి ఆదిత్యనాథ్ కు కృతజ్ఞతలు