Hari Hara Veera Mallu: జూలై 24న వీరమల్లు విడుదల... అఫీషియల్గా అనౌన్స్ చేసిన పవన్ టీమ్
Hari Hara Veera Mallu New Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హిస్టారికల్ ఫిల్మ్ 'హరిహర వీరమల్లు' న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూలైలో థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురు చూపులకు తెర పడింది. థియేటర్లలోకి 'హరిహర వీరమల్లు' ఎప్పుడు వస్తుంది? అనే ప్రశ్నకు సమాధానం లభించింది. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధం అయ్యింది. జూలైలో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు పవన్ టీమ్ అధికారికంగా అనౌన్స్ చేసింది.
జూలై 24న వీరమల్లు విడుదల
Hari Hara Veera Mallu New Release On July 24th: నో మోర్ డిలే... ఇకపై వాయిదాలు లేవు... జూలైలో వీరమల్లుగా పవన్ కళ్యాణ్ థియేటర్లలోకి రావడం వంద శాతం గ్యారెంటీ. హరిహర వీరమల్లు చిత్రాన్ని జూలై 24న విడుదల చేయనున్నట్లు మెగా సూర్య ప్రొడక్షన్స్ అనౌన్స్ చేసింది.
Also Read: 'కుబేర' రివ్యూ: నాగార్జున vs ధనుష్... ఇద్దరిలో ఎవరిది పైచేయి? శేఖర్ కమ్ముల సినిమా ఎలా ఉందంటే?
One fights for Power.
— Hari Hara Veera Mallu (@HHVMFilm) June 21, 2025
One fights for Dharma.
The clash of legacies begins. 🔥
Witness the Battle for truth, faith and freedom 𝐈𝐧 𝐂𝐢𝐧𝐞𝐦𝐚𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒, 𝟐𝟎𝟐𝟓 ⚔️🔥
A Historic Experience Awaits ❤️#HariHaraVeeraMallu 🏹#HHVMonJuly24th #HHVM… pic.twitter.com/WHLUZWtavA
జూన్ 12న వీరమల్లును విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. ఆ మేరకు నిర్మాత ప్రచార కార్యక్రమాల సైతం ప్రారంభించారు. భారీ ఎత్తున సాంగ్ లాంచ్ ఈవెంట్స్ చేశారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆలస్యం కావడంతో విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. సినిమా అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
పవన్ సరసన నిధి అగర్వాల్
హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించారు. ఔరంగజేబు పాత్రలో బాబి డియోల్... ఓ ప్రత్యేక గీతంలో అనసూయ, పూజిత పొన్నాడ కనిపించనున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా... ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభించింది. జూలై 24న థియేటర్లలో భారీ విజయం సాధించడం ఖాయమని చిత్ర బృందం ధీమాగా ఉంది.
నిర్మాతకు అడ్వాన్స్ ఇచ్చిన పవన్!
పవన్ కళ్యాణ్, నిర్మాత ఏయం రత్నం మధ్య మంచి అనుబంధం ఉంది. ఇండస్ట్రీ హిట్ ఖుషి ప్రొడ్యూస్ చేయడంతో పాటు ఆ తరువాత పవన్ హీరోగా బంగారం చేశారు. వాళ్ళిద్దరి కలయికలో మూడో చిత్రమిది. ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా ట్రెండ్ దృష్టిలో పెట్టుకొని నిర్మాణంలో రాజీ పడకుండా భారీగా ఖర్చు చేశారు. విడుదల దగ్గరకు వచ్చేసరికి వాయిదా పడడం వల్ల నిర్మాత కాస్త ఇబ్బందుల్లో ఉన్నారని గ్రహించి... ఆయన దగ్గర తీసుకున్న 11 కోట్ల రూపాయల అడ్వాన్స్ వెనక్కి ఇవ్వడంతో పాటు విడుదలైన తర్వాత చూసుకుందామని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సమాచారం.





















