తోటి కళాకారులకు అండగా నిలబడటంలో, వాళ్ళ కష్టసుఖాల్లో ఎప్పుడూ ముందు ఉండే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరోసారి తన మానవత్వాన్ని, మంచి మనసును చాటుకున్నారు. 'గబ్బర్ సింగ్'తో పాటు పలు చిత్రాల్లో విలన్, కామెడీ రోల్స్ చేసి ప్రేక్షకులను అలరించిన నటుడు రమేష్ (Gabbar Singh Ramesh Actor) ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  సంగతి తెలిసిందే. ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించారు.

Continues below advertisement

రమేష్ కుటుంబానికి మూడు లక్షల సాయంఅపోలో ఆసుపత్రిలో డాక్టర్ సుబ్బారెడ్డితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు రమేష్ ఆరోగ్య పరిస్థితిని చిరంజీవి తెలుసుకుంటున్నారు. అతని చికిత్సకు అవసరమైన అన్ని విధాల సహాయం చేస్తున్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రమేష్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు.

Also Read: Balakrishna - బాలయ్య ఆరోగ్యం కోసం భారీ హోమం... ప్రత్యేక పూజలు చేయిస్తున్న దర్శకుడు గోపీచంద్ మలినేని

Continues below advertisement

రమేష్ కుటుంబ సభ్యులను చిరంజీవి పరామర్శించారు. చికిత్స ఖర్చులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో రమేష్ సతీమణికి మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు చిరంజీవి. అంతే కాకుండా... రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా అవసరమైన సహాయం అందేలా సిఫార్సు చేస్తామని రమేష్ కుటుంబ సభ్యులకు చిరంజీవి హామీ ఇచ్చారు.

Also ReadChennai Love Story Collections - చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?

మెగా కుటుంబం నుంచి 'గబ్బర్ సింగ్' రమేష్ కుటుంబానికి మరో రెండు లక్షల రూపాయల సాయం అందింది. శనివారం (జూలీ 25న) నాగబాబు తన తరఫున రెండు లక్షల రూపాయల చెక్కును అందించారు. తోటి కళాకారుల పట్ల చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు చూపిస్తున్న ఆప్యాయత, ఆత్మీయత, బాధ్యతాభావానికి ఇది మరో నిదర్శనంగా నిలిచిందని రమేష్ కుటుంబ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు. సినీ కార్మికులు, నటీనటులు అవసరంలో ఉన్నప్పుడు చిరంజీవి ఎన్నో సందర్భాల్లో సహాయం అందించారు. 

Also ReadJana Nayagan Collections - 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?