Bollywood: బాలీవుడ్ దర్శకుడు మృతి... నాలుగైదు రోజులుగా ఇంట్లోనే శవం... దుర్వాసన రావడంతో వెలుగులోకి
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఎంఎం బేగ్ కన్నుమూశారు. ఆయనకు 70 ఏళ్లు. గత నాలుగైదు రోజులుగా ఆయన ఇంటి నుంచి బయటకు రాలేదు. దాంతో దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ళు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఎంఎం బేగ్ ఇకలేరు. ఇటీవల ఆయన మరణించారు. అయితే ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆయనకు 70 ఏళ్లు. గత నాలుగైదు రోజులుగా ఆయన ఇంటి నుంచి బయటకు రాలేదు. దాంతో దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ళు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆయన మృతి చెందినట్టు పీఆర్వో హనీ జావేరి తెలిపారు.
పీటీఐతో హనీ జావేరి మాట్లాడుతూ... "ఎంఎం బేగ్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. నాలుగైదు రోజులుగా ఆయన ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో... ఆయన ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని చుట్టుపక్కల వాళ్లకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపులు తెరవగా... బేగ్ మృతదేహం కనిపించింది. వెంటనే ఆయన కుమార్తెకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి తరలించారు" అని చెప్పారు.
జెఓం ప్రకాష్, విమల్ కుమార్, రాకేష్ రోషన్ దగ్గర దర్శకత్వ శాఖలో సహాయకుడిగా ఎంఎం బేగ్ కెరీర్ ప్రారంభమైంది. గోవింద నటించిన 'ఆద్మీ ఖిలోనా హై', 'జైసీ కర్ణి వైసీ భర్ణి', 'కర్జ్ చునా హై', అనిల్ కపూర్ నటించిన 'కిషన్ కన్హయ్య' వంటి పలు సినిమాలకు ఆయన పని చేశారు. దర్శకుడిగా నసీరుద్దీన్ షా నటించిన 'మసూమ్ గవా' (1990), శిల్పా శిరోద్కర్ నటించిన 'ఛోటీ బహు' (1994) చేశారు.
'కహో నా ప్యార్ హై' విడుదలకు చాలా కాలం ముందు డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ వంటి విషయాల్లో ఎంఎం బేగ్ దగ్గర హృతిక్ రోషన్ శిక్షణ తీసుకున్నారు. రాకేష్ రోషన్, బేగ్ మధ్య సాన్నిహిత్యం ఉంది. దాంతో తనయుడిని బేగ్ దగ్గరకు పంపారు రాకేష్. ఎంఎం బేగ్ కుమార్తె ఒకప్పుడు హిందీలో పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్. ఆమె పేరు బేబీ గుడ్డు అలియాస్ షాహిందా బేగ్. రాజేష్ ఖన్నా, స్మితా పాటిల్ నటించిన 'ఆఖిర్ క్యూన్?', శ్రీదేవి నటించిన 'నాగీనా', అనిల్ కపూర్ 'ప్యార్ కియా హై ప్యార్ కరేంగే' జీతేంద్ర, శ్రీదేవిల 'ఔలాద్' సినిమాల్లో ఆమె నటించింది.























