Bhojpuri Power Star Pawan Singh: భోజ్‌పురి పవర్ స్టార్ పవన్ సింగ్ తన వ్యక్తిగత జీవితం గురించి తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. 2014లో నీలం సింగ్‌ను వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని నెలలకే ఆమె ఆత్మహత్య చేసుకుంది. పవన్ సింగ్ కూడా దీని గురించి మాట్లాడారు. ఆ తర్వాత 2018లో రెండో పెళ్లి చేసుకున్నారు.

Continues below advertisement

ఆయన రెండో వివాహం జ్యోతి సింగ్‌తో జరిగింది. ఈ వివాహ బంధం కూడా బ్రేక్ అయ్యింది. ఈ మధ్య కాలంలో నాలుగు గోడల మధ్య గొడవపడే వీళ్లిద్దర ఇప్పుడు బహిరంగంగాన తిట్టుకుంటున్నారు. ప్రత్యేకంగా ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ తిట్టుకుంటున్నారు. దీంతో వీరి సంసార జీవితం సరిగా లేదనే విషయం అందరికీ తెలిసింది. పవన్ సింగ్, జ్యోతి సింగ్‌ మధ్య పెద్ద వివాదానికి దారి తీసింది. వారు ఒకరిపై ఒకరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆరోపణలు కూడా చేసుకున్నారు. పవన్ సింగ్ జ్యోతికి విడాకులు కోరుకుంటున్నారు. ఇప్పుడు జ్యోతి సింగ్ పవన్ సింగ్‌ను భరణంగా 30 కోట్లు డిమాండ్  చేస్తుననటట వార్తలు వస్తున్నాయి.

జ్యోతి పవన్ సింగ్‌ను భరణం కోరింది

పవన్ సింగ్ లాయర్ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో జ్యోతి సింగ్ 30 కోట్ల భరణం డిమాండ్ చేసిందని ఆయన చెబుతున్నారు.

లాయర్ మాట్లాడుతూ, 'జ్యోతి భరణంగా పవన్ సింగ్‌ను 30 కోట్లు డిమాండ్ చేసింది. ఇంకా కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు ఏం జరగదు. వారు ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి. మీడియాలో ఈ విషయాలు తీసుకురావడం సరికాదు. ఇంత అవమానం తర్వాత ఎవరు ఆమెతో ఉంటారు. పవన్ సింగ్ విడాకులు కోరుకుంటున్నారు. జ్యోతి ఎంత భరణం అడిగినా ఏమీ కాదు. పవన్ సింగ్ సంపాదన ఎంత ఉందో చూస్తారు. కోర్టు సరైన నిర్ణయం తీసుకుంటుంది.'

పవన్ సింగ్ భోజ్‌పురి పరిశ్రమలో పెద్ద స్టార్. అతను ఇటీవల రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్‌లో కనిపించాడు. ఈ షోలో అతను కొన్ని వారాలు మాత్రమే ఉన్నాడు. షోలో కూడా అతను జ్యోతితో విభేదాల గురించి మాట్లాడాడు. రాజకీయాల కారణంగా పవన్ సింగ్ ఈ షోను మధ్యలోనే వదిలేశాడు.