Viral Trailer: కన్న కొడుకుపై తండ్రి కేస్... తల్లి మరణానికి కారణం ఎవరు? వైరల్ ట్రైలర్ చూశారా?
Bhojpuri Movie BabuJi Trailer: భోజ్పురి సినిమాలపై కొందరికి చిన్న చూపు ఉంటుంది. అయితే... 'బాబూజీ' ట్రైలర్ చూశాక ఆ అభిప్రాయం తప్పకుండా మారుతుంది. ఇప్పుడు అది వైరల్ అవుతోంది.

భోజ్పురి సినిమాలపై కొందరికి చిన్న చూపు ఉంటుంది. అందుకు కారణం అటు యూట్యూబ్, ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సాంగ్స్ కావచ్చు. అయితే... 'బాబూజీ' ట్రైలర్ చూశాక ఆ అభిప్రాయం తప్పకుండా మారుతుంది. భోజ్పురి చిత్రసీమకు చెందిన పాపురల్ నిర్మాత రత్నాకర్ కుమార్, దర్శకుడు పరాగ్ పాటిల్ కాంబినేషన్లో రూపొందిన సినిమా 'బాబు జీ'. ఈ మూవీ ట్రైలర్ శనివారం విడుదలైంది. కొన్ని క్షణాల్లో ఆ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది చూశాక... భోజ్పురి సినిమాలపై అభిప్రాయం తప్పకుండా మారుతుంది. ఈ కథ ప్రజలపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
'బాబు జీ' ట్రైలర్ విషయానికి వస్తే... మన సమాజంలో తల్లిదండ్రుల పట్ల కొందరి సంతానంలో పెరుగుతున్న ద్వేషాన్ని, నిర్లక్ష్యాన్ని లోతుగా ఆవిష్కరించింది. బాబు జీతో పాటు ఆయన భార్యను సొంత పిల్లలు ఇంటి నుంచి వెళ్ళగొడతారు. భార్య ఆరోగ్య పరిస్థతి బాలేకపోయినా... రోజువారి కూలీ పనులు చేస్తూ జీవితాన్ని వెల్లదీస్తారు తల్లిదండ్రులు. ఓ రోజు యాక్సిడెంట్లో తల్లి మరణిస్తుంది. దాంతో తన పిల్లలకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయడానికి తండ్రి రెడీ అవుతాడు. కోర్టులో కేసు వేస్తాడు. ఇదీ ట్రైలర్లో క్లుప్తంగా చూపించిన కథ.
View this post on Instagram
'బాబూ జీ' ట్రైలర్ వైరల్ కావడానికి కారణం... పిల్లలను ఎంత బాగా చూసుకున్నా, ప్రతి కలలను నెరవేర్చినా, తల్లిదండ్రులకు ఆసరగా నిలబడాల్సిన సమయంలో అదే పిల్లలు తమ తల్లిదండ్రులను భారంగా భావిస్తున్న సందర్భాలు చూశాం. వృద్ధాశ్రమాలు లేదా రోడ్డుపై వదిలేయడం వంటి ఘటనలు జరిగాయి. ఆ కథను చూపించడంతో ఈ ట్రైలర్ వైరల్ అవుతోంది.
భోజ్పురి చిత్రసీమలో స్టార్ అవధేష్ మిశ్రా, రిచా దీక్షిత్, అనితా రావత్, దేవ్ సింగ్, దీపికా సింగ్, అమరీష్ సింగ్, నిషా గుప్తా, రాకేష్ త్రిపాఠి, బంధు ఖన్నా తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాకు రత్నాకర్ కుమార్ నిర్మాత కాగా... నివేదితా కుమార్ సహ నిర్మాత. పరాగ్ పాటిల్ దర్శకత్వం వహించారు. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కథను రాకేష్ త్రిపాఠి రాయగా, సాజన్ మిశ్రా సంగీతం అందించారు. సుగం సింగ్, కాజల్ రాజ్ పాటలను ఆలపించారు. దుర్గేష్ భట్, ధరం హిందుస్థానీ పాటలు రాశారు.























