Ranveer Singh: తెలుగులో రణవీర్ను బ్యాన్ చేయలేదు... Don 3కి చేసినట్టు ప్రశాంత్ వర్మ గొడవ చేయలేదు
Tollywood Silence Over Ranveer Singh: డాన్ 3 చేయనని రణవీర్ సింగ్ చెప్పడంతో ఫర్హాన్ అక్తర్ కంప్లైంట్ చేశారు. దాంతో హీరోపై బ్యాన్ విధించారు. ఇటువంటి ఇష్యూలో తెలుగు దర్శక నిర్మాతలు సైలెంట్గా వదిలేశారు.

రణవీర్ సింగ్ వర్సెస్ ఫర్హాన్ అక్తర్... బాలీవుడ్ ఇండస్ట్రీలో వాళ్ళిద్దరి మధ్య గొడవ హాట్ టాపిక్. 'డాన్ 3'లో హీరోగా నటించడం కుదరదని రణవీర్ సింగ్ (Ranveer Singh) చెప్పేశారు. ఆ మాట ఫర్హాన్ అక్తర్ (Farhan Akhtar)ను హర్ట్ చేసింది. దాంతో కంప్లైంట్ చేశారు. రణవీర్ మీద ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ బ్యాన్ విధించింది. 'డాన్ 3' కంటే ముందు తెలుగు దర్శక నిర్మాతలతో కూడా రణవీర్ సింగ్ ఈ విధంగా చేశారు. అయితే... అప్పుడు అతణ్ణి బజారుకు ఈడ్చలేదు. ప్రశాంత్ వర్మ సైలెంట్గా వదిలేశారు. ఆ ఇష్యూలోకి వెళితే...
బ్రహ్మ రాక్షస... ఒక్క రోజు తర్వాత వెనక్కి!
'హనుమాన్' విడుదలకు ముందు ఆ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ, విడుదలైన తర్వాత పాన్ ఇండియా సక్సెస్ సాధించడంతో అందరి చూపు దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) మీద పడింది. అతనితో సినిమాలు చేయడానికి హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపించారు. అప్పుడు రణవీర్ సింగ్ హీరోగా 'బ్రహ్మ రాక్షస' ప్లాన్ చేశారు ప్రశాంత్ వర్మ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక్క రోజు షూటింగ్ కూడా చేశారు.
'బ్రహ్మ రాక్షస' చిత్రీకరణ జరిగిన ఒక్క రోజులో రణవీర్ సింగ్, ప్రశాంత్ వర్మ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్లు వచ్చాయి. ఇంకేముంది? సినిమా ఆగింది. ఫర్హాన్ అక్తర్ తరహాలో ప్రశాంత్ వర్మ గానీ.. మైత్రి అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ గానీ తమకు నష్టం వచ్చిందని గొడవ చేయలేదు. మౌనంగా వదిలేశారు. భవిష్యత్తులో మళ్ళీ కలిసి పని చేసే అవకాశం కోసం చూస్తున్నామని హుందాగా గొడవకు ముగింపు పలికారు. అఫీషియల్గా సినిమా చేయడం లేదని రణవీర్, ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేశారు.
View this post on Instagram
ప్రభాస్ హీరోగా 'బ్రహ్మ రాక్షస'... పేరు 'బక'
రణవీర్ సింగ్ 'నో' చెప్పిన ప్రాజెక్టుకు రెబల్ స్టార్ ప్రభాస్ యస్ చెప్పారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ చిత్రానికి 'బ్రహ్మ రాక్షస' బదులు 'బక' టైటిల్ ఖరారు చేసినట్టు టాక్. అందులో కథానాయికగా 'మిస్టర్ బచ్చన్', 'ఆంధ్ర కింగ్ తాలూకా', 'కాంత' సినిమాల ఫేమ్ భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి కొంత టైమ్ పడుతుంది. రణవీర్ నో చెప్పడం వల్ల ప్రశాంత్ వర్మ సమయం వృథా అయ్యింది. ఆయన రేంజ్ మాత్రం తగ్గలేదు.
పాన్ ఇండియా సక్సెస్ 'కాంతార' తర్వాత 'జై హనుమాన్' చేయడానికి రిషబ్ శెట్టి ముందుకు వచ్చారు. 'ధురంధర్' విజయం తర్వాత 'మహంకాళి' చేయడానికి అక్షయ్ ఖన్నా 'ఎస్' చెప్పారు. ప్రభాస్ హీరోగా 'బక' ఓకే అయ్యింది. మరికొందరు హీరోలు సైతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారు. మరోవైపు 'ధురంధర్ 2' లాంటి భారీ సక్సెస్ వచ్చినా వివాదాల్లో ఉన్నారు రణవీర్ సింగ్. 'డాన్ 3'కి 'నో' చెప్పినందుకు నష్ట పరిహారంగా 45 కోట్లు డిమాండ్ చేస్తున్నారట నిర్మాతలు.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















