Buddy Release Trailer Out: టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 2న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడో పూర్తయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల 'బడ్డీ' వాయిదా పడుతూ వస్తోంది. చాలా కాలంతో ఈ అల్లు వారబ్బాయి నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.


ఎట్టకేలకు ఆగస్ట్‌ 2న రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌ను ఫుల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో నింపారు. ఇందులో శిరీష్‌ సరికొత్తగా కనిపించాడు. టెడ్డీబేర్‌ ఎంట్రీతో ట్రైలర్‌ మొదలవుతుంది. ఎవరో పర్మిషన్‌ లేకుండా లోపలికి వచ్చారు.. బ్యాగ్రౌండ్‌ వాయిస్‌ వస్తుండగా యాక్షన్‌ సీక్వెన్స్‌ చూపించారు.



హీరో యాక్షన్ సీక్వెన్స్‌ టెడ్డీబేర్‌ కూడా ఉండటం ఆసక్తి పెంచుతుంది. టెడ్డీ బేర్‌ మాట్లాడటం, ఫైట్‌ సీన్స్‌ చేయడం వంటి అంశాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇందులో అల్లు శిరీష్‌ ఇదివరకు ఎన్నడు లేనంత కొత్త లుక్‌లో కనిపించాడు. యాక్షన్‌ సీన్స్‌ స్టైలిష్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. మొత్తానికి ట్రైలర్‌ మూవీపై మరింత ఆసక్తి పెంచుతుంది.ట్రైలర్‌లో ప్రధాన పాత్రలను కూడా పరిచయం చేశారు. హిప్ హాప్ తమిళ అందించిన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా సంగీతం కూడా ఆయనే అందిస్తున్నారు. ఇదిలా ఉంటే 'బడ్డీ' మూవీ టికెట్‌ రేట్స్‌ తగ్గించినట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే. 






ఇదే విషయాన్ని ట్రైలర్‌ చివరిలోనూ రివీల్‌ చేశారు. సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 99 మల్టీప్లెక్స్‌లో రూ. 125 మాత్రమే టికెట్ రేట్స్ ఉండబోతున్నాయి. ఈ సినిమా మరింత ఎక్కువ మంది ఆడియెన్స్ ను ఆకర్షించేందుకే మూవీ టీం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బడ్డీ మూవీ యాక్షన్ ప్యాకెడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఉండబోతోంది. ఈ సినిమా కథ అంతా ఓ టెడ్డీబేర్‌ చూట్టూ తిరుగుతుంది. టెడ్డీ బేర్‌ హీరోతో కలిసి అన్యాయంపై పోరాటం చేయడం అనే డిఫరెంట్‌ స్టోరీ లైన్ తో తెరకెక్కినట్లుగా తాజా ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. ఈ సినిమాలో శిరీష్‌ సరసన గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజ్మల్ అమీర్ కీలక పాత్ర పోషించగా.. ముఖేష్ కుమార్, అలీ ఇతర పాత్రల్లో నటించారు. 


Also Read: మెగాస్టార్‌ చిరంజీవిపై నెటిజన్స్‌ ఫైర్‌ - చిరు ఎంటీ ఇలా చేశారు! ఎయిర్‌పోర్టు వీడియో వైరల్‌!