Nayanthara  About Fahad Fazil's Aavesham: మలయాళీ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ నటించిన తాజా చిత్రం ‘ఆవేశం’. ఆయన సొంత బ్యానర్‌లో తన భార్య నజ్రియా నజీమ్ నిర్మాతగా ఈ సినిమా రూపొందింది. జిత్తు మాధవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కేరళ నుంచి ఉన్నత విద్యను చదివేందుకు  బెంగళూరు వెళ్లిన ఓ యువకుడు గ్యాంగ్‌ స్టర్‌ గా ఎలా మారాడు? అనే సింగిల్ పాయింట్‌ తో ఈ సినిమాను తెరకెక్కించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందిన ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి, మన్సూర్ అలీ ఖాన్, సజిన్ గోపు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సినిమా చాలా బాగుంది అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.  


‘ఆవేశం‘పై నయనతార ప్రశంసలు  


గతవారం నయనతార భర్త విఘ్నేష్ శివన్ 'ఆవేశం' సినిమాపై రివ్యూ ఇచ్చారు. "అత్యద్భుతమైన సినిమా. చూసి ఉలిక్కిపడ్డాను. ఈ చిత్రాన్ని మేకర్స్ అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు” అని వెల్లడించారు.ఫహద్ ఫాసిల్ తో పాటు చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. తాజాగా ఈ సినిమాపై నయనతార ప్రశంసల జల్లు కురిపించింది. నటుడు ఫహద్ ఫాసిల్, దర్శకుడు జిత్తు మాధవన్, సినిమా టెక్నికల్ టీమ్ పనితీరు అద్భుతం అంటూ ప్రశంసించింది. ఈ మేరకు ఇన్ స్టా వేదికగా ఓ స్టోరీని షేర్ చేసింది. "‘ఆవేశం‘ ఈ దశాబ్దపు అద్భుత సినిమా. జిత్తు మాధవన్ భవిష్యత్తు కమర్షియల్ చిత్రాలకు బౌండరీస్ ఏర్పాటు చేశాడు. ఫహద్ ఫాసిల్.. ఫాఫా సూపర్ స్టార్. వాట్ ఏ కిల్లర్ పెర్ఫార్మెన్స్. నజ్రియా సో ప్రౌడ్ ఆఫ్ యు బేబీ’ అని రాసుకొచ్చింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సుశీల్ శ్యామ్‌పైనా ఆమె ప్రశంసలు కురిపించింది. ఈ సినిమాలో నటించిన యంగ్ స్టార్స్ రోషన్‌ షానవాస్,  మిధున్ జైశంకర్, హిప్జ్‌స్టర్, మిధుట్టి యాక్టింగ్ అద్భుతం అని ప్రశంసించింది. 


‘ఆవేశం‘ గురించి సమంత ఏం అన్నదంటే?


‘ఆవేశం‘ సినిమా గురించి స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కూడా రివ్యూ ఇచ్చింది. “‘ఆవేశం‘ సినిమా అంటే పిచ్చి. నేను ఎంతో ఇష్టపడ్డ పిచ్చి. ఈ సినిమాను చూసి భయపడ్డాను. నవ్వాను. ఈ సినిమాను కేవలం థియేటర్లలో మాత్రమే చూడాలి. ఎంజాయ్ చేయాలి. ఈ సినిమాలో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ అభినందనలు” అని  ఎంజాయ్ ని   


ప్రస్తుతం ఫహాద్ పాసిల్ తెలుగులో ‘పుష్ప 2’లో నటిస్తున్నారు. ‘పుష్ప’లో భ‌న్వ‌ర్‌ సింగ్ షెకావత్ అనే పోలీసు అధికారిగా కనిపించిన ఆయన, ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. మెయిన్ విలన్ గా అలరించనున్నారు. ఈ సినిమా ఆగ‌ష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  


Read Also: జిమ్‌లో మిడ్ నైట్ రష్మిక వర్కవుట్స్... 100 కేజీలు ఎత్తిన నేషనల్ క్రష్