Actress Jyoti: టాలీవుడ్ క్యారెక్టర్ యాక్ట్రెస్ జ్యోతి అందరికీ సుపరిచితమే. సినిమాల్లో రొమాంటిక్ కామెడీ పాత్రల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు ‘బిగ్ బాస్’ లో కంటెస్టెంట్ గా మెరిసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే జ్యోతి.. తన విషయాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఎంపీ విజయ విజయసాయి రెడ్డిపై ఓ సెటైరికల్ వీడియోని పోస్ట్ చెయ్యడం చర్చనీయాశంగా మారింది. 


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల కాలంలో అనుకోని విధంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 67 ఏళ్ళ వయసులో ఆయనపై అక్రమ సంబందం ఆరోపణలు వచ్చాయి. తన భార్య దేవాదాయ శాఖ ఏసీ శాంతితో విజయసాయికి సంబంధం ఉందని, ఆయన కారణంగానే ఒక బిడ్డకు జన్మనిచ్చిందని మదన్‌ మోహన్‌ అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు. డీఎన్‌ఏ టెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే శాంతి మాత్రం తన మొదటి భర్తకు ఎప్పుడో విడాకులు ఇచ్చి న్యాయవాది సుభాష్‌ ను పెళ్లి చేసుకున్నట్లుగా చెబుతోంది. విజయసాయి సైతం తనపై వస్తున్న రూమర్స్ ను మీడియా ముఖంగా ఖండించారు. ఈ వివాదంలో ఇరు వర్గాలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో.. గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. 


విజయసాయి రెడ్డి, శాంతి, మదన్‌ మోహన్‌, సుభాష్‌ ల వివాదంలో నిజా నిజాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న తరుణంలో ఇదే ఇష్యూపై నటి జ్యోతి ఓ మీమ్ వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె నటించిన ‘పెళ్ళాం ఊరెళితే’ సినిమాలోని సన్నివేశాన్ని విజయసాయి రెడ్డి వివాదంతో ముడిపెడుతూ ఈ వీడియో ఎడిట్ చేయబడింది. 'మదన్ మోహన్ ఫిలిమ్స్ ప్రజంట్స్.. ఆ బిడ్డకు తండ్రెవరు?' అంటూ వచ్చిన ఈ మీమ్ ని ఎవరు ఎడిటింగ్ చేసారో తనకు తెలియదు కానీ, ఇది చాలా ఫన్నీగా ఉందని జ్యోతి క్యాప్షన్ పెట్టింది. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 


ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, వేణు తొట్టెంపూడి, సంగీత, రక్షిత ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పెళ్ళాం ఊరెళితే’. ఈ సినిమాలో తిలోత్తమ అనే వేశ్య క్యారక్టర్ లో నటించింది జ్యోతి. ఇందులో ఆమెది కథను మలుపుతిప్పే కీలక పాత్ర. ఓ హోటల్ లో శ్రీకాంత్, వేణు, గుండు హనుమంతరావులలో జ్యోతి ఎవరికి భార్య అనే విషయంలో బ్రహ్మానందం కన్ఫ్యూజ్ అయ్యే సన్నివేశం సినిమాలో హిలేరియస్ గా పేలింది. ఇప్పుడు అదే సీన్ ని విజయసాయి రెడ్డి, శాంతి ఇష్యూతో సింక్ చేస్తూ ఎడిట్ చేసిన వీడియోని జ్యోతి పోస్ట్ చేసింది. దీనిపై వైసీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేయడంతో, జ్యోతి వాటిని హైడ్ చేసింది. 






ఇక సినిమాల విషయానికొస్తే, 'పెళ్లాం ఊరెళితే' తర్వాత 2005లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'హంగామా' చిత్రంలో ఆలీకి జోడీగా నటించింది జ్యోతి. 'ఓ మై లవ్' మూవీలో ప్రధాన పాత్ర పోషించింది. ఎవడి గోల వాడిది, మహాత్మ, కాంచనమాల కేబుల్ టీవీ, గుడుంబా శంకర్, రంగ ది దొంగ, చిత్రాంగ, సాహసం సేయరా డింభకా, కెవ్వు కేక, దరువు, యముడికి మొగుడు వంటి అనేక తెలుగు చిత్రాల్లో ఆమె నటించింది. జ్యోతి ఎక్కువగా కామెడీ టచ్ ఉండే వ్యాంప్ తరహా పాత్రల్లో కనిపించింది. తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్-1లో కంటెస్టెంట్ గా పాల్గొంది. అయితే ఆమె ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయింది.


Also Read: సినిమాల్లోకి రాకముందు సూర్య ఏం చేసేవాడో తెలుసా? రూ.600 మాత్రమే జీతం - హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!