(Source: ECI | ABP NEWS)
Chiranjeevi: 80s లెజెండరీ స్టార్స్ రీయూనియన్ - ఒకప్పటి స్టార్ హీరోస్, హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా?
80s Stars Reunion: 80s స్టార్స్ అంతా కలిసి ఒకే చోట సందడి చేశారు. '80s రీ యూనియన్'లో భాగంగా శనివారం చెన్నైలో కలిసిన వీరంతా అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆటపాటలతో సరదాగా గడిపారు.

Chiranjeevi Venkatesh In 80s Stars Reunion in Chennai: 80s టైంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోలు, హీరోయిన్లు ఒకే చోట చేరి సందడి చేశారు. '80s రీ యూనియన్' పేరిత ప్రతీ ఏడాది సౌత్ ఇండియన్ స్టార్ హీరోలంతా ఒకే చోట చేరి సరదాగా గడిపి, అప్పటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారన్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా రీ యూనియన్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి నుంచి వెంకటేష్, మీనా, సుహాసిని, ఖుష్బూ తదితరులు ఓ చోట కలుసుకున్నారు.
ఈసారి చిరుత థీమ్తో...
ఈసారి భిన్నంగా కోలీవుడ్ స్టార్ కపుల్ రాజ్ కుమార్ సేతుపతి, శ్రీప్రియ తమ ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేయగా శనివారం స్టార్ హీరోలు, హీరోయిన్లు అంతా కలిసి సంతోషంగా గడిపారు. అప్పటి రోజుల్లో సినిమాలు, తమ నటన, సరదా విషయాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ సందడి చేశారు. ఈసారి చిరుత థీమ్ ప్లాన్ చేసిన స్టార్స్ అంతా చీతా ప్రింట్స్ ఉన్న డ్రెస్సుల్లోనే మెరిశారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
31 మంది స్టార్స్
టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ నుంచి దాదాపు 31 మంది స్టార్స్ ఈ రీ యూనియన్కు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కోసం టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఒకే ఫ్లైట్లో చెన్నై చేరుకున్నారు. ఇద్దరూ కలిసి 'గెట్ టు గెదర్'కు హాజరయ్యారు. వీరితో పాటు సుహాసిని, సుమలత, జయసుధ, రమ్యకృష్ణ, శ్రీప్రియ, నదియ, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, రాధ, రెహమాన్, సుమలత, ఖుష్భూ, లిస్సీ, మేనక, శోభన, భానుచందర్, ప్రభు, రేవతి, భాగ్యరాజ్, పూర్ణిమ, నరేష్, సురేష్, జయరాం, అశ్వతి, సరితా, మీనా, లత, స్వప్న, జయశ్రీ తదితరులు హాజరయ్యారు.
అలా మొదలైంది
2009లో '80s స్టార్స్ రీ యూనియన్' ప్రారంభమైంది. లిస్సీ, సుహాసిని ఆధ్వర్యంలో ఫస్ట్ టైం గెట్ టు గెదర్ ఏర్పాటు చేశారు. ఇక 2019లో మెగాస్టార్ చిరంజీవి 10 రీయూనియన్ నిర్వహించారు. 2022లో చివరి రీ యూనియన్ జరగ్గా... బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్, హీరోయిన్ పూనమ్ ధిల్లాన్ పార్టీ హోస్ట్ చేశారు. 2023లో రీ యూనియన్ జరగలేదు. ఆ తర్వాత ఏడాది చెన్నైలో వరదల కారణంగా ఈవెంట్ వాయిదా పడింది. మళ్లీ మూడేళ్ల తర్వాత అందరు స్టార్స్ రీ యూనియన్లో ఆటలు, పాటలతో సరదాగా గడిపారు.
ఈ ఫోటోలను చిరంజీవి తన 'X' అకౌంట్లో షేర్ చేశారు. '80ల నాటి నా ప్రియమైన స్నేహితులని కలిసినప్పుడల్లా నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ప్రతీ సమావేశం మొదటిదానిలాగే కొత్తగా అనిపిస్తుంది.' అంటూ రాసుకొచ్చారు.
Every reunion with my beloved friends from the 80s is a walk down memory lane, filled with laughter, warmth, and the same unbreakable bond we’ve shared for decades.☺️
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 5, 2025
So many beautiful memories, and yet every meet feels as fresh as the first! ❤️#80sStarsReunion pic.twitter.com/97uT70U4CV
Also Read: ఓటీటీలోకి 'త్రిబాణధారి బార్బరిక్' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?





















