బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనె గురించి ప్రత్యేకంగా పరిచయం లేదు. సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. దశాబ్ద కాలంగా బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. రణ్ వీర్ తో పెళ్లి తర్వాత, ప్లాన్ గా, సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. తాజాగా షారుఖ్ తో కలిసి ‘పఠాన్‘ లో నటించింది. తన బోల్డ్ లుక్స్ తో యూత్ ను మాయ చేసింది. సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అందాల విందుతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

   


ఆ విషయంలో మగవాళ్లు మ్యాగీ కంటే చీప్- దీపిక


తాజాగా దీపిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో శృంగారం గురించి ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. మగవారిలో శృంగార సామర్థ్యం చాలా తక్కువ అంటూ మాట్లాడటం వైరల్ గా మారింది. “శృంగారంలో మగవారు మ్యాగీ కంటే చీప్. ఆడవారితో పోల్చుకుంటే మగవారు ఈ విషయంలో స్టామినా చాలా తక్కువ” అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. దీపికా కామెంట్స్ పై కొంత మంది విమర్శలు చేస్తుంటే, మరికొంత మంది ఆమె చెప్పింది నిజమే అని సమర్థిస్తున్నారు. అయినా ఆమె దాని గురించి ఇంత పచ్చిగా చెప్పాలా? అంటూ మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు.


‘ప్రాజెక్ట్ K’లో నటిస్తున్న దీపికా పదుకొనె


ఇక ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ ‘ప్రాజెక్ట్ K’లో నటిస్తోంది. ప్రభాస్ సరసన హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ సినిమాలో నటనకు గాను దీపిక భారీగా రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఏకంగా రూ. 14 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. దీపికకు ఇండియాతో పాటు విదేశాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ఆమె ఈ సినిమాలో నటించడం ద్వారా సినిమాను బాగా మార్కెట్ చేసుకోవచ్చని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌  పోషిస్తున్నారు. ఆయ‌న రోల్ సినిమా అంతా ఉంటుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.  సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వినీద‌త్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే ప‌లు సంద‌ర్భాల్లో వెల్లడించారు. ఇది పాన్ ఇండియా కాదు.. పాన్ వ‌ర‌ల్డ్ సినిమా అని ఇప్ప‌టికే నాగ్ అశ్విన్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు.  ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు కూడా మేక‌ర్స్ అనౌన్స్ చేసేశారు.  


‘పఠాన్’తో భారీ హిట్ అందుకున్న దీపిక


ఇక రీసెంట్ గా దీపికా ‘పఠాన్’ సినిమాలో నటించింది. షారుఖ్ తో కలిసి చేసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కింది.  ప్రపంచవ్యాప్తంగా జనవరి 2న విడుదలైన ఈ సినిమా రికార్డ్ స్థాయి కలెక్షన్లను అందుకుంది.  ఈ సినిమా ఒక్క హిందీలోనే రూ.519.50 కోట్ల నికర ఆదాయాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1041.25 కోట్ల వసూళ్లు అందుకుంది.


Read Also: పాపం అషూరెడ్డి - పెళ్లి చేసుకుని ఎన్ని కష్టాలు పడుతుందో? ఆ పద్మవ్యూహం చక్రధారికే తెలుసు