బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం మొత్తం టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతోంది. ఇప్పటికే హౌస్ మేట్స్ ఈ టాస్క్ లో భాగంగా కొన్ని ఛాలెంజ్ లను ఎదుర్కొన్నారు. వారిలో తక్కువ పాయింట్స్ రావడంతో ప్రియాంక, కాజల్ లను గేమ్ నుంచి తప్పించారు. మెలిగిన హౌస్ మేట్స్ మానస్, సన్నీ, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ లకు టికెట్ టు ఫినాలే గెలుచుకునే అవకాశం ఉంది. ఈరోజు ఎపిసోడ్ లో కూడా ఈ టాస్క్ కంటిన్యూ అవ్వనుంది. ఇప్పటికే ఓ ప్రోమో విడుదల చేయగా.. అందులో సన్నీ.. కాజల్ పై అరుస్తూ కనిపించాడు. గేమ్ లో తనను డిస్టర్బ్ చేయడంతో సన్నీకి కోపమొచ్చి కాజల్ పై అరిచేశాడు. 


ఇక తాజాగా మరో ప్రోమో విడుదలైంది. ఇందులో హౌస్ మేట్స్ అందరూ కలిసి 'యాక్యురెసీ' ఛాలెంజ్ ను ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా పోటీదారులకు సంబంధించిన బోర్డ్స్ పై కొన్ని బల్బ్స్ ఉన్నాయి. ప్రతి బల్బ్ కింద ఆ బల్బ్ కి సంబంధించిన స్విచ్ ఉంది. బోర్డ్స్ పై ఉన్న బల్బ్స్ లో కొన్ని ఆన్, కొన్ని ఆఫ్ చేసి ఉన్నాయి. ప్రతీ పోటీదారుల లక్ష్యం వీలైనంత తక్కువ సమయంలో వారి బోర్డ్స్ పై ఉన్న బల్బ్స్ అన్నింటినీ ఆన్ చేయాల్సి ఉంటుంది. 


సన్నీ-షణ్ముఖ్ ఈ గేమ్ ని ఆడుతూ కనిపించారు. ఆ తరువాత మానస్-షణ్ముఖ్ ఆడుతూ కనిపించారు. బహుశా సిరి కోసం కూడా షణ్ముఖ్ గేమ్ ఆడి ఉంటాడు. ఫైనల్ గా బిగ్ బాస్.. టికెట్ టు ఫినాలే గెలుచుకోవడానికి చివరి ఛాలెంజ్ లో ఇద్దరు పోటీదారులు పోటీపడతారని చెప్పారు. ఆ ఇద్దరూ ఎవరో ఈరోజు షోలో తెలియనుంది!