రెండు రోజులుగా బిగ్ బాస్ షోలోకి ఫ్యామిలీ మెంబర్స్ ను పంపించారు బిగ్ బాస్. ఈరోజు ఎపిసోడ్ లో స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున.. ఇవాళ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పగానే.. హౌస్ మేట్స్ ముఖాలు వెలిగిపోయాయి. ముందుగా రవి తల్లి స్టేజ్ పైకి వచ్చింది. ఎమోషనల్ అయిపోయిన రవిని చూస్తూ.. 'కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బిగ్‌బాస్‌ కి రాజావి' అంటూ డైలాగ్ వేసింది అతడి తల్లి. 

 



ఆ తరువాత కమెడియన్ జబర్దస్త్‌ అప్పారావు స్టేజ్ పైకి వచ్చి శ్రీరామచండ్రని ఉద్దేశిస్తూ.. 'నువ్ ఎవరూ లేరని బాధపడుతున్నావ్ అని సాయిలేఖను తీసుకొచ్చా' అని చెప్పగా.. 'లోపలికి పంపండి' అని శ్రీరామ్ అనడం 'అంత కరువుగా ఉన్నావా..? నువ్' అని అప్పారావు కౌంటర్‌ ఇవ్వడంతో అందరూ నవ్వేశారు. సన్నీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అందులో ఒక వ్యక్తి 'కప్పు ముఖ్యం బిగిలూ' అంటూ డైలాగ్ వేశాడు. 

 

బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివ బాలాజీ కూడా స్టేజ్ పైకి వచ్చి సందడి చేశారు. 'ఇప్పుడు తెలిసిందా బిగ్‌బాస్‌ అంటే ఏంటో' అని శివ బాలాజీ హౌస్‌మేట్స్‌ ను ఆటపట్టించారు. ఆ తరువాత నాగార్జున 'టాప్ 5 ఎవరో చెప్పమని అడగ్గా'.. 'బయలుదేరండి బాయ్ బాయ్' అంటూ చెప్పాడు శివబాలాజీ. ఆ తరువాత సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ ను స్టేజ్ పైకి పిలిచారు నాగార్జున. వెంటనే సిరి వెక్కి వెక్కి ఏడ్చేసింది. 'సిరి వదిలేస్తున్నావా' అని శ్రీహాన్‌ అడగడంతో ఆమె మరింత ఎమోషనల్ అయిపోయింది.