బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ మొదలై వారం రోజులవుతోంది. గతవారం జరిగిన నామినేషన్స్ లో సరయు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ జరిగిన వెంటనే.. సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు బిగ్ బాస్. ఈ క్రమంలో తాజాగా ప్రోమోను విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ ప్రోమోలో ముందుగా మానస్.. లోబోను నామినేట్ చేశాడు. దీన్ని సహించలేని లోబో.. నామినేట్ చేయడానికి సరైన కారణాలు చెప్పాలని డిమాండ్ చేశాడు. 

 


 

'మీరు హీరో కదా.. యాటిట్యూడ్ చూపిస్తున్నారు.. వినడానికి కూడా రెడీ లేరు' అంటూ మానస్ మీద మండిపడ్డాడు లోబో. తరువాత కాజల్.. గ్రూప్స్ లో చాలామంది  ఫేక్ గా ఆడుతున్నారని అభిప్రాయపడింది. అనంతరం విశ్వను నామినేట్ చేసింది. 'నీ మెచ్యూరిటీ నచ్చిందంటూ' శ్రీరాంచంద్రను నామినేట్ చేశాడు యాంకర్ రవి. నటి ప్రియా.. సన్నీ, నటరాజ్ మాస్టర్ లను నామినేట్ చేసింది.

 

ఉమాదేవి వంతు రాగా.. 'దమ్ము, ధైర్యం, బుద్ధిబలం, సత్తా ఉన్నవాళ్లు నాతో ఆడదానికి ట్రై చేయండి' అని సవాలు విసిరింది. ఆ తరువాత యానీ మాస్టర్ ను ఉద్దేశిస్తూ.. 'నాతో మాట్లాడాలంటే భయంగా ఉందా..?' అంటూ డైలాగ్ వేయగా.. 'అది భయం కాదు.. రెస్పెక్ట్' అంటూ యానీ మాస్టర్ ఘాటుగా బదులిచ్చింది. వెంటనే ప్రియాంక.. 'సరే పోవే ఉమా పో' అంటూ ఛీ కొట్టింది. దీంతో అందరూ షాకయ్యారు. మరి ఈ మాటలకు ఉమాదేవి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి!




Also Read: ఖరీదైన కారు కొన్న చెర్రీ.. స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న మెగా పవర్ స్టార్, ధర ఎంతంటే..


Also Read: సాయిధరమ్ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ పూర్తి.. హెల్త్ బులెటిన్ విడుదల