26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా 'మేజర్' అనే సినిమాను రూపొందించారు. ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషించారు. 'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల  నటించింది. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 


ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.18 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకోగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో కలిపి రూ.13 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఈ సినిమా విడుదలైన రెండు రోజులకు 'మేజర్' ఎంత వసూలు చేసిందంటే..?


ప్రాంతాల వారీగా కలెక్షన్స్.. 
నైజాం      -  రూ.3.37 కోట్లు 
సీడెడ్       -  రూ.87 లక్షలు 
ఉత్తరాంధ్ర - రూ.98 లక్షలు 
ఈస్ట్            - రూ.65 లక్షలు 
వెస్ట్              - రూ.44 లక్షలు 
గుంటూరు     - రూ.52 లక్షలు 
కృష్ణా             - రూ.50 లక్షలు 
నెల్లూరు        - రూ.35 లక్షలు 


మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.7.68 కోట్ల షేర్ ను సాధించింది ఈ సినిమా. గ్రాస్ రూపంలో చూసుకుంటే ఇది రూ.12.90 కోట్లు. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని రూ.55 లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది. హిందీలో రూ.1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ.4.20 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ఓవరాల్ గా ఈ సినిమా రూ.13.48 కోట్లు సాధించింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.25.10 కోట్లన్నమాట. 
Also Read: కావాలనే గ్యాప్ ఇచ్చి సినిమాలు చేస్తుంటా - నజ్రియా కామెంట్స్


Also Read: సీఎంను కలిసిన నయనతార, విఘ్నేష్ శివన్