రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన చిత్రం ‘ఆదిపురుష్’. కనీవినీ ఎరుగని అంచనాల నడుమ ఈ నెల 16న విడుదల అయ్యింది.  తొలి షో నుంచే మిశ్రమ స్పందన లభించింది. సినిమా చాలా బాగుందని కొందరు చెప్తే, అస్సలు బాగాలేదని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. మొత్తం చెప్పాలంటే ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అలరించలేదని చెప్పుకోవచ్చు. సినిమాపై మొదటి నుంచి ఉన్న భారీ అంచనాలను అందుకోవడం ఈ సినిమా విఫలం అయ్యింది. ప్రధానంగా పేలవమైన VFX, చవకైన డైలాగ్‌లు, రామాయణం ఇస్లాంమీకరణ సహా పలువు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  


IMDb దారుణ రేటింగ్


‘ఆదిపురుష్’ చిత్రానికి IMDb దారుణమైన రేటింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా 3.8/10 రేటింగ్ పొందింది. ఇటీవల కాలంలో డిజాస్టర్లుగా మిగిలిన చిత్రాల కంటే ‘ఆదిపురుష్’ మూవీ రేటింగ్ దారుణంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అక్షయ్ కుమార్ ఫ్లాప్ చిత్రం ‘సెల్ఫీ’కి 5.9, రణబీర్ కపూర్ ‘షంషేరా’కు 4.8 రేటింగ్ ఉంది. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా కూడా 5.6 రేటింగ్ పొందింది. కానీ ‘ఆదిపురుష్ చిత్రం 10 పాయింట్లకు గాను కేవలం 3.8 పాయింట్లు సాధించడం ఆశ్చర్యకరం.


ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టి-సిరీస్ నిర్మించింది. 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది,  భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత ఖరీదైన  చిత్రాలలో ఒకటిగా చెప్పబడుతుంది. ఈ చిత్రంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించాడు. బాలీవుడ్ నటి కృతి సనన్ జానకి (మా సీత) పాత్రను పోషించింది.  సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించాడు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటించాడు.  ఈ చిత్రం 2020లో ప్రకటించినప్పటి నుండి భారీ హైప్‌ని క్రియేట్ చేసింది. తెలుగుతో పాటూ హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది.   






‘ఆదిపురుష్’పై రచయిత మనోజ్ ఆసక్తికర వివరణ


తాము తీసింది రామాయణం కాదని, రామయణం స్ఫూర్తిగా తీసుకుని రూపొందించామని మనోజ్ తెలిపారు. “’ఆదిపురుష్’ సినిమాను రామాయణం అని మేము చెప్పలేదు. రామాయణంగా తీయలేదు. కేవలం, మేము రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించాం. ఈ విషయాన్ని మేము సినిమా డిస్ క్లైమర్ లో కూడా వేశాం. రామాయణంలో జరిగే ఒక భాగాన్ని ఆధారంగా తీసుకుని ‘ఆదిపురుష్’ సినిమాను తెరకెక్కించాం. ఈ విషయాన్ని పలుమార్లు చెప్పాం. మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న మార్కెట్ కు అనుగుణంగానే ఈ సినిమాను తీశాం. అంతేకానీ, మేం తీసింది సంపూర్ణ రామాయణం కాదు. ఈ విషయాన్ని ప్రేక్షకులు గుర్తుంచుకోవాలి” అని వివరించారు.


Read Also: ఫాదర్స్ డే సందర్భంగా తారకరత్నకు పిల్లల నివాళి, కంటతడి పెట్టిస్తున్న అలేఖ్య ఇన్ స్టా పోస్టు