Mrunal Thakur: సినిమా రంగంలో లవ్ స్టోరీ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఏ భాషలో అయినా ఈ సినిమాలకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఎక్కువ మంది కొత్త దర్శకులు ముందు లవ్ స్టోరీ సినిమాలను తెరకెక్కిస్తుంటుంటారు. టాలీవుడ్ లోనూ ఇది కొనసాగుతూ వస్తుంది. ఈ మధ్య కాలంలో సినిమాల పట్ల ప్రేక్షకుడి విజన్ మారింది. సిల్వర్ స్క్రీన్ పై కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే ఇతర కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. సరైన లవ్ స్టోరీ సినిమా వచ్చి చాలా రోజులైంది. టాలీవుడ్ లో ఆ గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేస్తున్నారు కొంత మంది యువ దర్శకులు. అలాంటి వారిలో హను రాఘవపూడి ఒకరు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతారామం’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ స్వచ్చమైన ప్రేమ కథతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. ఇందులో మృణాల్ అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ ‘సీతారామం’ సినిమా పార్ట్ 2 గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. నెట్టింట ఓ అభిమానికి ప్రశ్నకు బదులిస్తూ ‘సీతారామం 2’ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


‘సీతారామం’ సినిమా గతేడాది ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని సక్సెస్ ను అందుకుంది. ఓ ఎమోషనల్ లవ్ స్టోరీను ఎంతో కవితాత్మకంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో హను రాఘవపూడి సక్సెస్ అయ్యారు. ఈ మూవీలో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, పాటలు ముఖ్యంగా మృణాల్ నటన అందర్నీ థియేటర్లకు క్యూ కట్టేలా చేశాయి. వాస్తవానికి ఇలాంటి కాన్సెప్ట్ లవ్ స్టోరీలు ఈ మధ్య కాలంలో చాలా అరుదుగా వస్తున్నాయి. అందుకే ఈ మూవీను ప్రేక్షకులు అంతగా ఆదరించారు. ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఈ సినిమాతో మృణాల్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చేసింది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఆమె సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటుంది. అప్పుడప్పుడూ అభిమానుల ప్రశ్నలకు జవాబులు చెబుతుంది.


ఈ క్రమంలో తాజాగా ఓ అభిమాని ఆమె ‘సీతారామం 2’ ఉంటుందా? అని అడిగాడు. దీనికి మృణాల్ సమాధానం చెప్పింది. తనకు ఈ విషయం గురించి పూర్తిగా తెలియదని, కానీ ‘సీతారామం 2’ ఉండాలనుకుంటున్నానని బదులిచ్చింది. దీంతో ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘సీతారామం’ సినిమా హిట్ అయిన తర్వాత అందరూ ఈ సినిమాకు సీక్వెల్ ఉండాలని అనుకున్నారు. అయితే దర్శక నిర్మాతలు దాని గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఇప్పుడు మృణాల్ ‘సీతారామం 2’ ఉంటే బాగుంటుందని అనడంతో ఈ మూవీ సీక్వెల్ పై మళ్లీ ఆసక్తి నెలకొంది. ఆమె ఇలా చెప్పిందంటే నిజంగా సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నారు అని చర్చించుకుంటున్నారు నెటిజన్స్. మరి దీనిపై మూవీ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.