బాలీవుడ్ నటి కాజోల్ సోషల్ మీడియా నుంచి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని  ఇన్ స్టాతో పాటు ట్విట్టర్  వేదికగా వెల్లడిస్తూ గుడ్ బై చెప్పింది. “నా జీవితంలో చాలా కష్టతరమైన పరీక్షలలో ఇదొకటి’’ అంటూ పోస్టు పెట్టింది.  దానికి  “సోషల్ మీడియా నుంచి విరామం తీసుకుంటున్నా’’ అనే క్యాప్షన్ పెట్టింది. అయితే, ఆమె ఇన్ స్టాగ్రామ్ నుంచి వైదొలగడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇదే సమయంలో తనకు సంబంధించిన ఇన్ స్టా పోస్టులు అన్నింటినీ డిలీట్ చేసింది.


కాజల్ కు అభిమానుల మద్దతు


కాజోల్ నిర్ణయం పట్ల నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. “సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వడం మీకు మంచి మేలు కలిగిస్తుందని భావిస్తున్నాం. అంతేకాదు, మీరు జీవితంలో ఎదురైన కష్టతరమైన పరీక్ష నుంచి త్వరలో బయటపడాలని కోరుకుంటున్నాం” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. "మీరు ఎలాంటి సమస్యను అయినా ఎదుర్కోగలరు. ఆ సామర్థ్యం మీకు ఉంది. త్వరలోనే మీరు ఈ సమస్య నుంచి బయటపడుతారు” అని భావిస్తున్నాం అని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. "మీరు ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి కారణమేమిటో మాకు తెలియదు, కానీ, మేము ఎప్పటికీ మిమ్మల్ని అభిమానిస్తూనే ఉంటాం. మీ నిర్ణయంతో ఇకపై అందమైన పోస్టులను కోల్పోతాం అని భావిస్తున్నాం. అయినా, మీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. మీకు అభినందనలు చెప్తున్నాం” అని మరికొంత మంది రాశారు.  "టేక్ యూర్ టైమ్ క్వీన్, మీరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాం. మీరు ఇన్ స్టాలో ఉన్నా, లేకున్నా, ఎప్పటికీ మీ మీద ప్రేమ, అభిమానం అలాగే ఉంటుంది. మీకు  ఎప్పటికీ అండగా ఉంటాం” అని మరికొంత మంది కామెంట్స్ పెట్టారు.






'లస్ట్ స్టోరీస్ 2'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కాజోల్


ప్రస్తుతం కాజోల్ 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తాజాగా  ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. ఇందులో తమన్నా భాటియా, మృణాల్ ఠాకూర్ ప్రధానపాత్రల్లో నటించారు.  ఇందులో తమన్నాతో పాటు మృణాల్ సైతం శృంగార సన్నివేశాలు చేశారట.ఇంకా 'లస్ట్ స్టోరీస్ 2'లో నీనా గుప్తా, కుముద్ మిశ్రా, అమృతా సుభాష్, అంగద్ బేడీ, తిలోత్తమా షోమే నటించారు. 


జూన్ 29 నుంచి 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ 


'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్  నాలుగు కథల సమాహారంగా తెరకెక్కించారు. ఫస్ట్ సీజన్ కూడా అంతే! ఒక్కో కథకు ఒకొక్కరు దర్శకత్వం వహించారు. 'లస్ట్ స్టోరీస్ 2'లో కథలకు సుజోయ్ ఘోష్, ఆర్. బల్కి, నటి కొంకణ్ సేన్ శర్మ, అమిత్రవీంద్రనాథ్ శర్మ దర్శకులు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికలో జూన్ 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. హిందీలో తీసినప్పటికీ... దక్షిణాది భాషల్లో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయనున్నారు.


Read Also: ఏలియన్ కాదు, ఉర్ఫీ జావేద్ - ఈ సారి నిండు దుస్తులతో ఆశ్చర్యపరిచిన బిగ్ బాస్ బ్యూటీ!